నిర్మల్ అర్బన్ జనవరి 11 : విద్యార్థులు పాఠశాల స్థాయి నుంచే సైన్స్పై ఆసక్తి పెంచుకొని భావి శాస్త్రవేత్తలుగా ఎదగాలని రాష్ట్ర శాస్త్ర, సాంకేతిక శాఖ, అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పిలుపునిచ్చారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని సెయింట్ థామస్ పాఠశాలలో సోమవారం ప్రారంభమైన రాష్ట్ర స్థాయి సైన్స్ ఫెయిర్, ఇన్స్పైర్ మేళాలు బుధవారంతో ముగిశాయి. ఈ సందర్భంగా జాతీయ స్థాయికి ఎంపికైన 26 మంది విద్యార్థులకు మెమొంటోలతో పాటు ప్రశంసా పత్రాలు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కేరళలోని త్రిసూల్లో ఈ నెల 27వ తేదీ నుంచి జరిగే జాతీయ స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలో సత్తాచాటి తెలంగాణ రాష్ర్టానికి మంచి పేరు తీసుకురావాలని కోరారు.
విద్యార్థులు పాఠశాల స్థాయి నుంచే సైన్స్పై ఆసక్తి పెంచుకొని భావి శాస్త్రవేత్తలుగా ఎదగాలని రాష్ట్ర శాస్త్ర సాంకేతిక శాఖ, అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పిలుపునిచ్చారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని సెయింట్ థామస్ పాఠశాలలో సోమవారం ప్రారంభమైన రాష్ట్ర స్థాయి సైన్స్ ఫెయిర్, ఇన్స్పైర్ మేళాలు బుధవారంతో ముగిశాయి. ఈ సందర్భంగా జాతీయ స్థాయికి ఎంపికైన 26 మంది విద్యార్థులకు అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి మెమొంటోలతో పాటు ప్రశంసా పత్రాలు అందజేశారు. అనంతరం మం త్రి మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు శాస్త్ర సాంకేతిక రంగాల్లో రాణించేలా ఉపాధ్యాయులు ప్రోత్సహించాలని సూచించారు. పాఠశాల స్థాయి నుంచే సైన్స్పై ఆసక్తి పెంచుకోవడం వల్ల అనేక అద్భుతాలు సాధిస్తారని చెప్పారు.
నిర్మల్ జిల్లాలో మొదటి సారిగా సైన్స్ ఫెయిర్ నిర్వహించినందుకు ఆనందంగా ఉందని, విజయవంతానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నానని చెప్పారు. డీఈవో రవీందర్ రెడ్డి, నిర్వహణ కమిటీ సభ్యులు, ఆయా ఉపాధ్యాయ సంఘాల నాయకుల సహకారంతో కార్యక్రమం సక్సెస్ అయ్యిందన్నారు. ఎక్కడాఎలాంటి లోటు పాట్లు లేకుండా రుచికరమైన భోజనంతో పాటు వసతి సౌకర్యాన్ని కల్పించామని తెలిపారు. సైన్స్ ఫెయిర్లో అత్యుత్తమ ప్రదర్శనలు చేపట్టిన విద్యార్థులు ఈ నెల 27వ తేదీ నుంచి 31వ తేదీ వరకు కేరళలోని త్రిసూల్లో జరిగే జాతీయ స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలో పాల్గొంటారని తెలిపారు.
జాతీ య స్థాయిలోనూ రాణించి తెలంగాణ రాష్ర్టానికి గుర్తింపు తీసుకురావాలని కోరారు. ముగింపు వేడుకల సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే విఠల్ రెడ్డి, కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారుఖీ, అదనపు కలెక్టర్ హేమంత్ బో ర్కడే, ఆర్డీవో స్రవంతి, ప్రిన్సిపాల్ ఆంటోని, ఏరియా దవాఖాన సూపరింటెండెంట్ దేవేందర్రెడ్డి, సర్పంచ్ గంగాధర్, ఎస్సీఆర్టీ రాష్ట్ర సైన్స్ అధికారి సురేశ్ బాబు, ఉమారాణి, పుష్పలత, ఎం పీపీ రామేశ్వర్ రెడ్డి, డీఈవో రవీందర్ రెడ్డి, జిల్లా సైన్స్ అధికారి వినోద్ కుమార్, అన్ని జిల్లాల సైన్స్ అధికారులు, గైడ్ టీచర్లు, ఉపాధ్యాయ సంఘాల రాష్ట్ర, జిల్లా స్థాయి నాయకులు పాల్గొన్నారు.
క్రాప్ డ్రయర్
రైతులు పండించిన సోయా,మక్క, గోధుమ, వడ్లువంటివాటిని ఆరబోసినప్పుడు వాటిని అటూ.. ఇటూ తిరగేయడం కష్టతరమవుతుంది. ఈ క్రాప్ డ్రయర్ మిషన్ ద్వారా ఆహార ధాన్యాలను సులభంగా తిరిగేయవచ్చు. ఎలాంటి ఇంధన ఖర్చులు లేకుండా సోలార్ ద్వారా వచ్చే సౌర శక్తిని మోటారుకు అమర్చితే ఇది పని చేస్తుంది. ఈ యంత్రానికి అమర్చిన గిరకలు తిరగడం వల్ల అవి త్వరగా ఆరుతాయి.
– మహ్మద్ ఖాసీఫ్, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల, ఆదిలాబాద్
ఎలక్ట్రానిక్ శాపింగ్ ట్రాలీ
నిత్యావసర సరుకులు తీసుకునేందుకు శాపింగ్ మాల్లకు వెళ్తుంటాం. అక్కడ నచ్చినవన్నీ కొనుగోలు చేస్తాము. కౌంటర్ వద్దకు వచ్చిన తర్వాత బిల్లింగ్ చేసే సరికి పాకెట్లో ఉన్న మనీ కంటే.. తీసుకున్న వస్తువులకు కట్టాల్సిన నగదే ఎక్కువగా ఉంటుంది. దీంతో ఏ వస్తువును తీసివేయాలనేది కష్టమవుతుంది. సమయం కూడా వృథా అవుతుంది. ఈనేపథ్యంలో ఎలక్ట్రానిక్ ట్రాలీ పరికరం ద్వారా మనం తీసుకున్న వస్తువులపై ఉన్న కోడ్ను స్కాన్ చేస్తే డిస్ప్లేపై అమౌంట్ చూపిస్తుంది. ఈ విధానం వల్ల మన వద్ద ఉన్న నగదుకు సరిపోయేలా వస్తువులను తీసుకోవచ్చు.
– బీ. మనికుషల్, జడ్పీహెచ్ఎస్, మలక్పల్లి, ధర్మసాగర్, హన్మకొండ,
డ్రైవర్ను అలర్ట్ చేసేలా..
వాహనదారులు రోజుల తరబడి వాహనాలను నడుపుతూ ఉంటారు. వారికినిద్ర సరిపోదు. వాహనాలు నడిపేటప్పుడు కళ్లు మూసుకుపోతూ ఉంటాయి. అప్పుడే రోడ్డ ప్రమాదాలు జరుగుతుంటాయి. ఈ నేపథ్యంలో రూపొందించిన ఈ పరికరం ద్వారా రోడ్డు ప్రమాదాలను నివారించవచ్చు. డ్రైవర్ కండ్లు మూయగానే వాహనంలో ఏర్పాటు చేసిన సెన్సార్ ద్వారా బీప్ అనే సౌండ్ మోగుతూనే ఉంటుంది. దీంతో డ్రైవర్ అప్రమత్తమవుతాడు.
– వీ.సాయి సూర్య వర్మ, విద్యాభారతి హైస్కూల్. రామచంద్రాపురం. సంగారెడ్డి
టన్నెల్లలో ఆటోమెటిక్ లైటింగ్ సిస్టం
టన్నెల్లో లైటింగ్ సిస్టం లేక వాహనాలు ప్రమాదాలకు గురవుతుంటాయి. ఈ ప్రయోగం ద్వారా విద్యుత్ను ఆదా చేయడమేగాక ప్రమాదాలనూ నివారించవచ్చు. మైక్రో కంట్రోలర్ సెన్సార్ ద్వారా టన్నెల్లోకి వాహనం ప్రవేశించిన వెంటనే విద్యుత్ లైట్లు ఆన్ అవుతాయి. వాహనం వెళ్లిపోగానే ఆ లైట్లు ఆఫ్ అయ్యేలా దానిని రూపొందించారు.
– సీ.హెచ్. సాయితేజ ఏకశిల హైస్కూల్. ఆలేరు యాదాద్రి