నిర్మల్ టౌన్, ఫిబ్రవరి 10 : నిర్మల్ జిల్లా స్థాని క సంస్థల అదనపు కలెక్టర్గా విధులు నిర్వహిస్తున్న హేమంత్ బోర్కడేను ప్రభుత్వం కలెక్టర్గా నియ మించింది. ఆయనను కుమ్రంభీం ఆసిఫాబాద్ కలెక్టర్గా బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వు లు జారీ చేసింది. మహారాష్ట్రలోని అమరావతికి చెందిన హేమంత్ బోర్కడే ఐఏఎస్ ద్వారా అదనపు కలెక్టర్గా ఆసిఫాబాద్లో శిక్షణ పూర్తి చేసుకున్నారు.
అనంతరం నిర్మల్ జిల్లా స్థానిక సంస్థల కలెక్టర్గా ప్రభుత్వం నియమించింది. ఆగస్టు 8, 2020న నిర్మల్ అదనపు కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించారు. ఆయన హయాంలోనే నిర్మల్ జిల్లా లో పల్లె ప్రగతిలో భాగంగా వైకుంఠధామాలు, సెగ్రిగేషన్ షెడ్లు, పల్లె ప్రకృతివనాలు, బృహత్ పల్లె ప్రకృతివనాలు, రైతు వేదికలు నిర్మించారు. దీంతో ఆయనకు మంచి గుర్తింపు లభించింది. సౌమ్యుడిగా పేరు తెచ్చుకున్నారు. ఇటీవల కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ బదిలీ కాగా, వారం రోజులకే అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కడే సైతం కుమ్రం భీం ఆసిఫాబాద్కు బదిలీపై వెళ్లడం గమనార్హం.