ఆసిఫాబాద్,డిసెంబర్ 2: అసెంబ్లీ నియోజకవర్గ సాధారణ ఎన్నికల్లో భాగంగా ఆదివారం జరుగనున్న కౌంటింగ్ ప్రక్రియ పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వి కాస్ రాజ్ అన్నారు. శనివారం హైదరాబాద్ నుంచి అదనపు ఎన్నికల అధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల కలెక్ట ర్లు, ఎన్నికల అధికారులతో కౌంటింగ్ కార్యక్ర మం నిర్వహణపై సమీక్ష నిర్వహించారు. ఈ సం దర్భంగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి మా ట్లాడుతూ కౌంటింగ్ ప్రక్రియను ఎలాంటి పొరపాట్లు లేకుండా పకడ్బందీగా నిర్వహించాలని అన్నారు.
కౌంటింగ్ కేంద్రంలో టేబుళ్లు, కౌంట ర్లు, మీడియా, రాజకీయ పార్టీల ద్వారా నియమించబడిన ఏజెంట్లు ఇతరత్రా అన్ని ఏర్పాట్ల ను నిబంధనలకు లోబడి చేయాలని సూచించా రు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవనంలో గల వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ బొరడే హేమంత్ సహదేవరావు వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని 001-సిర్పూర్, 005-ఆసిఫాబాద్ నియోజకవర్గాలకు కలిపి జిల్లా కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో కౌం టింగ్ కేంద్రం ఏర్పాటు చేసి పూర్తి బందోబస్తు ని ర్వహించడం జరుగుతుందని తెలిపారు.
ప్రతి ని యోజకవర్గానికి 19 చొప్పున కౌంటింగ్ బృం దాలు, 14 కౌంటింగ్ టేబుళ్లు, 3 పోస్టల్ బ్యా లెట్ టేబుళ్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఉద యం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల లెకింపు, 8.30 గంటలకు కంట్రోల్ యూనిట్ల ఓట్ల లెకింపు ప్రారంభించడం జరుగుతుందని, ర్యాండం ప్రకారం వీవీ ప్యాట్లలోని స్లిప్పుల లె కింపు జరుగుతుందని తెలిపారు. ఎన్నికల సా ధారణ పరిశీలకుల సమక్షంలో కౌంటింగ్ ప్రక్రి య నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. కౌంటింగ్ ప్రక్రియ నిర్వహణ కొరకు అన్ని ఏ ర్పాట్లతో సిద్ధంగా ఉన్నామని తెలిపారు.