నిర్మల్ అర్బన్, ఏప్రిల్ 2 : నిర్మల్ జిల్లాలో సోమవారం నుంచి నిర్వహించే పదో తరగతి పరీక్షలకు విద్యాశాఖ అధికారులు సర్వం సిద్ధం చేశా రు. ఈ నెల 13 వరకు జరుగనున్న పరీక్షలకు జిల్లా వ్యాప్తంగా మొత్తం 9,078 మంది విద్యార్థు లు హాజరుకానున్నారు. ఇందులో 4,445 మంది బాలురు, 4,633 మంది బాలికలున్నారు. వీరికోసం జిల్లావ్యాప్తంగా 48 పరీక్షా కేంద్రాలను ఏ ర్పాటు చేశారు. వీటి పరిధిలో 144 సెక్షన్ను అమలు చేయనున్నారు. మాల్ ప్రాక్టీస్కు తావులేకుండా నిత్యం ఫ్లయింగ్, సిట్టింగ్ స్కాడ్స్, ప్రత్యే క బృందాలు తనిఖీలు చేపట్టనున్నాయి. ఈ సారి నిర్మల్ జిల్లాలో 100శాతం ఉత్తీర్ణతతో పాటు రా ష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిపేలా విద్యార్థులను సన్నద్ధం చేయగా.. ప్రత్యేక తరగతులు, నిత్యం స్లిప్ టెస్ట్లు, ప్రీఫైనల్ పరీక్షలు, గ్రాండ్ టెస్ట్లు నిర్వహించారు.
పరీక్షా కేంద్రాల్లో పలు ఏర్పాట్లు
పదో తరగతి పరీక్షలు రాసే విద్యార్థులకు వేసవిని దృష్టిలో ఉంచుకొని పరీక్షా కేంద్రాల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోనున్నారు. ఇందుకు సంబంధించి సెకండరీ బోర్డు పరీక్షల నిర్వాహకులకు ఆదేశాలు జారీ చేసింది. కేంద్రాల్లో విద్యుత్ సదుపాయం, ఫ్యాన్లు, ప్రతి పరీక్షా కేంద్రం బయట తాగునీరు, మరుగుదొడ్లు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, ఏఎన్ఎంను అందుబాటులో ఉంచనున్నారు. మాస్ కాపీయింగ్ అరికట్టేలా అధికారులకు కఠిన ఆదేశాలు జారీ చేశారు. కలెక్టర్లు, ఎస్పీతో విద్యాశాఖ అధికారులకు సమావేశాలు నిర్వహించారు. ఇన్విజిలేటర్లు, చీఫ్ సూపరిండెంట్లు, డిపార్ట్మెంటల్ అధికారులు పరీక్షలను పకడ్బందీగా నిర్వహించనున్నారు.
ప్రతి సెంటర్ పరిధిలో 144 సెక్షన్ అమ లు పర్చనున్నారు. ఫ్లయింగ్ స్కాడ్ బృందాలు నిత్యం తనిఖీలు నిర్వహిస్తాయి. ఇందులో తహసీల్దార్, ఎస్ఐ స్థాయి అధికారి, విద్యాశాఖ అధికారులు ఉంటారు. రాష్ట్ర విద్యా శాఖ ఆదేశాల మేరకు కేంద్రాల్లో సీసీ నిఘాను పటిష్టం చేశారు. పోలీస్ స్టేషన్ నుంచి తీసుకొచ్చిన ప్రశ్నాపత్రాలను ఓపెన్ చేసినప్పటి నుంచి తిరిగి జవాబు పత్రాలు ప్యాక్ చేసే వరకు జరిగే ప్రక్రియనంతా సీసీ కెమెరాల్లో రికార్డు చేయనున్నారు. ఆ డాటాను(సాఫ్ట్ కాపీ) విద్యాశాఖ అధికారులకు అందజేయాలి. వారి నుంచి బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కు చేరనుంది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో పేపర్ల లీకేజీకీ ఆస్కారం ఉండదు. ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల్లో జరిగే అక్రమాలకు పూర్తిగా అడ్డుకట్ట పడనుంది.
పకడ్బందీగా పరీక్షలు నిర్వహిస్తాం..
నిర్మల్ జిల్లాలో పదోతరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహిస్తాం. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. పరీక్షా కేంద్రానికి విద్యార్థులు గంట ముందుగానే చేరుకోవాలి. మాస్కాపీయింగ్ జరుగకుండా నిత్యం ఫ్లయింగ్ స్కాడ్ బృందాలు తనిఖీలు చేపట్టనున్నాయి. పరీక్షా కేంద్రంలో సెల్ఫోన్లను నిషేధించాం. తనిఖీలకు వచ్చే అధికారులు సైతం ఫోన్లు తీసుకరావొద్దని సూచించాం. పరీక్షా కేంద్రం వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుంది. విద్యార్థులు కష్టాన్ని నమ్ముకొని పరీక్షలకు హాజరుకావాలి. ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసేలా ఏర్పాట్లు చేశాం.
– రవీందర్ రెడ్డి, డీఈవో, నిర్మల్