భైంసా, జనవరి 31 : సీఎం కేసీఆర్ మున్సిపాలిటీలపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని, అందులో భాగంగా అభివృద్ధి కోసం ప్రత్యేక నిధులు కేటాయిస్తున్నారని ముథోల్ ఎమ్మెల్యే గడ్డిగారి విఠల్ రెడ్డి అన్నారు. భైంసా పట్టణంలోని మీ సేవ కాంప్లెక్స్ పక్కన గల స్థలంలో రూ.50 లక్షలతో ఎస్సీ దుకాణాల సుముదాయం.., రూ.50 లక్షలతో నర్సింహనగర్ వెళ్లే రోడ్డు.., రూ.30 లక్షలతో ఆర్డీవో కార్యాలయానికి వెళ్లే సీసీ రోడ్డు నిర్మాణాలకు మంగళవారం ఆయన శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భైంసా పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని అన్నారు. ఇప్పటికే రూ.1.30 కోట్లతో పనులు కొనసాగుతున్నాయని చెప్పారు. గడ్డెన్నవాగు ప్రాజెక్టు సమీపంలో త్వరలోనే పార్కు, తదితరాలు ఏర్పాటు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ జాబీర్ అహ్మద్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కృష్ణ, మురళీ గౌడ్, మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ ఆసీఫ్, బీఆర్ఎస్ పార్టీ పట్టణాధ్యక్షుడు ఫారూఖ్ హైమద్, 8వ వార్డు కౌన్సిలర్ తోట విజయ్, బీఆర్ఎస్ పార్టీ పట్టణ ఉపాధ్యక్షుడు ప్రసన్నజిత్ ఆగ్రే, న్యాయవాదులు శంకర్, వెంకటేశ్, అశోక్, మసేకర్ సాయిలు, జేకే పటేల్, రమేశ్ మాశెట్టి వార్, ఎంఐఎం కౌన్సిలర్ ఫయాజుల్లాఖాన్, కౌన్సిలర్ గౌతం పింగ్లే, పోశెట్టి పాల్గొన్నారు.
తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ దేగాంలో ఆశ కార్యకర్తలు ఎమ్మెల్యే విఠల్ రెడ్డిని కలిసి, వినతి పత్రం అందించారు. అలాగే అసెంబ్లీలో ప్రస్తావించాలని కోరారు.
కుభీర్ మండలంలో..
కుభీర్ మండలంలోని జాంగాం, సిర్పెల్లి తండా-1, కిషన్నాయక్ తండా, దావుజీ నాయక్ తండా, రామునాయక్ తండా, సాయినగర్, డోడర్న పంచాయతీల్లో సీడీపీ, జడ్పీ, మండల పరిషత్, దేవాదాయశాఖ నిధులు సుమా రు రూ.కోటితో చేపట్టే సీసీ రోడ్లు, సీసీ డ్రైన్లు, హ నుమాన్ మందిరం, జీపీ భవనాలు, పంట పొలాలకు వెళ్లేదారుల అభివృద్ధి, ఫార్మేషన్ తదితర ప నులకు జడ్పీటీసీ అల్కాతాయి చౌహాన్, బీఆర్ఎస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి తూము రాజేశ్వర్, సర్పంచులతో కలిసి ఎమ్మెల్యే విఠల్ రెడ్డి భూమిపూజ చేసి, శిలాఫలకాలను ఆవిష్కరించారు. ముందుగా గ్రామగ్రామాన ప్రజలు, నాయకులు ఆయనకు ఘనస్వాగతం పలుకుతూ సత్కరించారు. మాజీ జడ్పీటీసీ శంకర్ చౌహాన్, సంజయ్ చౌహాన్, సర్పంచులు ఆకుల గంగాధర్, ముజాహిద్ఖాన్, బాలాజీ, శంకర్ జాదవ్, షానూర్బీ, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు దత్తుగౌడ్, నాయకులు పానాజీ విజయ్కుమార్, ఈజీఎస్ ఏపీవో రాథోడ్ హరిలాల్, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ రాజన్న, పీ నరేందర్, ఎంపీటీసీ పంతుల హన్మాండ్లు, నాయకులు కార్యకర్తలు, ఆయా గ్రామాల ప్రజలు పాల్గొన్నారు.
కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ..
ముథోల్ తహసీల్ కార్యాలయంలో 59 మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే విఠల్ రెడ్డి కళ్యాణలక్ష్మి చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ అయేషా, తహసీల్దార్ శ్యాంసుందర్, సర్పంచ్ రాజేందర్, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు అఫ్రోజ్ ఖాన్, మున్నూరుకాపు సంఘం తాలుకా అధ్యక్షుడు రోళ్ల రమేశ్, కో-ఆప్షన్ సభ్యుడు మగ్దూమ్, నాయకులు శ్రీనివాస్ గౌడ్, మురళి, సంజు, సంతోష్, ఎంపీటీసీలు, సర్పంచులు, అధికారులు పాల్గొన్నారు.
సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ..
పార్డీ(కే) మాజీ సర్పంచ్ మైస శంకర్ అనారోగ్యానికి గురై, కార్పొరేట్ దవాఖానల్లో వైద్యం పొందుతూ మృతి చెందారు. అలాగే షహానే సారిక హైదరాబాద్లోని దవాఖానలో బ్రెయిన్కు సంబంధించిన సర్జరీ చేసుకున్నారు. కాగా, ఎమ్మెల్యే విఠల్ రెడ్డి చొరవతో రూ.1.50 లక్షల చొప్పున ప్రభుత్వం నుంచి మంజూరైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను సర్పంచ్ ఆకుల గంగాధర్, డీసీసీబీ మాజీ డైరెక్టర్, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు దొంతుల రాముతో కలిసి ఇరు కుటుంబాలకు అందజేశారు.