కెరమెరి, ఏప్రిల్ 5 : ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నందున పోలీసులు విధుల్లో అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ సురేశ్కుమార్ సూచించారు. మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ను శుక్రవారం అకస్మికంగా తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్ సిబ్బంది విధుల గురించి అడిగి తెలుసుకున్నారు. పోలీస్ స్టేషన్లో కేసులకు సంబంధించిన ఫైళ్లు, రికార్డులను పరిశీలించారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. క్షేత్రస్థాయిలో ఎన్నికల నియమావళి రాజకీయ పార్టీలు, వ్యక్తులకు అతీతంగా నిష్పక్షపాతంగా, పారదర్శకంగా అమలు చేయాలన్నారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో చెక్ పోస్టుల్లో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది అప్రమత్తంగా ఉంటూ విధులు నిర్వర్తించాలని చెప్పారు. పోలీస్ స్టేషన్కు ఫిర్యాదు చేసేందుకు వచ్చే వారితో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని, సమస్యలను పరిషరిస్తూ, మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేయాలని సూచించారు.
సిబ్బందికి ప్రతి గ్రామం గురించి అవగాహన కలిగి ఉండాలని, ప్రజలతో మమేకమై, ప్రజలకు మరింత చేరువకావాలని తెలిపారు. ఉత్తమ పనితీరు చూపిన వారికి ప్రతిఫలం దకుతుందని తెలియజేశారు. ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి పాటుపడాలని తెలిపారు. ప్రజా ఫిర్యాదుల విభాగంలో ఎలాంటి జాప్యం చేయకుండా తక్షణమే స్పందించాలని పోలీస్ సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో ఆసిఫాబాద్ డీఎస్పీ సదయ్య, సీఐ శ్రీనివాస్, ఎస్ఐ గుంపుల విజయ్తో పాటు పోలీస్ సిబ్బంది ఉన్నారు.