ఉట్నూర్ రూరల్, నవంబర్ 15 : యువత చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని ఆది లాబాద్ జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ సూచిం చారు. మండలంలోని లాల్టెక్డి గురుకుల జూనియర్ కళాశాల ప్రాంగణంలో నాలుగు రోజులుగా కొనసాగుతున్న 6వ రాష్ట్రస్థాయి గిరిజన గురు కులాల క్రీడలు మంగళవారంతో ముగిశాయి. ముగింపు కార్యక్రమానికి ఐటీడీఏ పీవో వరుణ్ రెడ్డితో కలిసి జడ్పీ చైర్మన్ ముఖ్య అతిథిగా హాజ రయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ.. రాష్ట్ర ప్రభుత్వం గురుకుల విద్యాలయాలకు అధిక ప్రాధాన్యత కల్పించిందన్నారు. పేద గి రిజన విద్యార్థులకు మెరుగైన విద్యా బోధన అందిస్తున్నదని తెలిపారు.
నేడు దేశంలో తెలంగాణ ప్రభుత్వం అత్యధికంగా గురుకులాలు ఏర్పాటు చేసి, నాణ్యమైన విద్య అందిస్తున్నదని చెప్పారు. అనంతరం గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో విద్యార్థులు చేసిన సాంసృతిక నృత్యాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా గురుకులాల ఆర్సీవో గం గాధర్, ఈడీ రవి కుమార్, సర్పంచ్ హరినాయక్, జడ్పీటీసీ చారులత, జీవ వైవిధ్య కమిటీ సభ్యుడు మర్సుకోల తిరుపతి, ప్రిన్సిపాల్ రాంమోహన్, రాజేంద్ర ప్రసాద్, పీడీలు, పీఈటీలు, సిబ్బంది, విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు.
నాలుగు రోజులు.. వివిధ పోటీలు..
12,13,14,15వ తేదీల్లో నాలుగు రోజుల పాటు ఖోఖో, కబడ్డీ, బాక్సింగ్, వాలీబాల్, హ్యాండ్బాల్, చెస్, ఫుట్బాల్, బ్యాట్మింటన్, అథ్లెటిక్ పోటీలు నిర్వహించారు. ఇందులో జోన్ -1 ఆదిలాబాద్, మెదక్.., జోన్ -2 కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి.., జోన్-3 నల్గొండ, ఖమ్మం.., జోన్-4 మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాల నుంచి 1200 మంది క్రీడాకారులు, ఎస్కార్ట్ సిబ్బంది, వ్యాయామ, క్రీడా ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
విజేతలు..
ఓవరాల్ చాంపియన్గా అండర్-14 విభాగం అథ్లెటిక్స్లో జోన్-3, అండర్-17లో జోన్-1,3, అండర్-19లో జోన్-4, ఓవరాల్ చాంపియన్ గా అండర్-14 విభాగంలో జోన్-3, అండర్-17లో జోన్-2, అండర్-19లో జోన్-4, అన్ని విభాగాల్లో కలిపి జోన్-2 మొదటి స్థానంలో నిలిచింది.