మంచిర్యాల, మార్చి 12(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కాంగ్రెస్ అధికారంలోకి వ చ్చాక అమలు చేస్తామన్న ఆరు గ్యారెంటీలు జనాలకు చుక్కలు చూపిస్తున్నాయి. ఎంతో ఆర్భాటం చేసి తీసుకొచ్చిన గృహజ్యోతి పథ కం అందరికీ రావడం లేదు. 200 యూనిట్ల లోపు కరెంట్ వాడుకున్న వారికి ఈ నెల బిల్లు వచ్చింది. దీంతో జనం హైరా నా పడిపోతున్నారు. పక్కింటి వాళ్లకు రాయి తీ ఇచ్చి మాకు ఎందుకు ఇవ్వడం లేదని వా పోతున్నారు.
ఉచిత కరెంట్ మేము ఏమైనా అడిగినమా.. ఇచ్చేటోళ్లు అందరికీ ఇవ్వాలే గానీ ఒకరికిచ్చి ఇంకొకరికి ఇవ్వకపోవడం ఏంటని మండి పడుతున్నారు. ప్రజాపాలన దరఖాస్తుల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా గృహ జ్యోతి(200 యూనిట్ల ఉచిత కరెంట్)కు 7,10,212 దరఖాస్తులు వచ్చాయి. వీరిలో నాలుగు లక్షల మందికే జీరో బిల్లులు వచ్చాయి. దీంతో వైట్ రేషన్ కార్డులు ఉండి కూడా అర్హత సాధించ లేకపోయినోళ్లు మళ్లీ ఇప్పుడెళ్లి ప్రజాపాలన కేంద్రాల్లో దరఖాస్తు చేసుకునేందుకు బారులుదీరుతున్నారు.
వివిధ కారణాలతో నిలిచిన మంజూరు
ఆసిఫాబాద్లో 1,26,706, నిర్మల్లో 2,08,486, మంచిర్యాలలో 2,19,184, ఆదిలాబాద్లో 1,91,772 మొత్తంగా 7. 50 లక్షల కుటుంబాలు తెల్లరేషన్కార్డు కలిగి ఉన్నాయి. వీరిలో ఏడు లక్షల మంది ప్రజాపాలనలో ఉచిత కరెంట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. కానీ.. ఈ నెల ఇప్పటి వరకు వచ్చిన కరెంట్ బిల్లుల్లో 4 లక్షల మందికి మాత్రమే ఫ్రీ ఇచ్చారు. మిగిలిన వారిలో చా లా మందికి 200 యూనిట్లలోపు ఉన్నప్పటి కీ బిల్లు మాత్రం ఎప్పటి మాదిరిగానే వచ్చిం ది.
ఉమ్మడి జిల్లాలో 6 లక్షల పైచిలుకు కరెం ట్ బిల్లులు జనరేట్ చేస్తే ఇందులో 60 శాతం మందికి మాత్రమే ఫ్రీ వచ్చినట్లు సమాచా రం. మిగిలిన వారికి బిల్లు యథావిధిగా వ చ్చింది. ఇక ఇప్పటి వరకు బిల్లులు రానివాళ్లలోనూ సగం మంది మాత్రమే అర్హులుంటారని తెలుస్తున్నది. దాదాపు వచ్చిన అప్లికేషన్లలో 200 యూనిట్ల లోపు కరెంట్ వినియోగించుకునే వాళ్లే 95 శాతానికి పైగా ఉ న్నారు.
కాకపోతే ఇందులో కొందరికి తెల్లరేషన్కార్డులు లేకపోవడం, ఆధార్కార్డు నంబ ర్లు సరిగా ఎంటర్ చేయకపోవడం, కస్టమర్ ఐడీ సరిగా ఇవ్వకపోవడం మొదలైన కారణాలతో ఉచిత కరెంట్ అనేది మంజూరుకాకపోవచ్చని అధికారులు చెప్తున్నారు. ఒకవేళ అ న్ని సరిగ్గా ఉన్నా 200 యూనిట్లు దాటి బిల్లు వచ్చి ఉండొచ్చంటున్నారు. ఇలాంటి సమస్యలు పరిష్కరించడానికి ప్రజాపాలన సెంటర్లను ఏర్పాటు చేశామంటున్నారు.
మరోవైపు గృహజ్యోతి కోసం ఏర్పాటు చేసిన ప్రజాపాలన సెంటర్లకు జనం పోటెత్తుతున్నారు. మేం వాడుకుంది 200 యూనిట్లలోపే ఉన్నా మాకు బిల్లువచ్చిందని పెద్ద ఎత్తున ఫిర్యాదులు చేస్తున్నారు. ప్రజాపాలన పాత అప్లికేషన్ చూపించి అధికారులను నిలదీస్తున్నారు. చేసేదేం లేక మరోసారి అప్లికేషన్లు పెట్టుకుని నిరాశగా వెనుతిరుగుతున్నారు.