భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) మహిళల పక్షపాతిగా మారింది. ఉద్యోగ, ఉపాధి రంగాల్లో దూసుకుపోతున్న అతివల సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నది. ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికల్లో 50 శాతం రిజర్వేషన్ కల్పించి రాజకీయాల్లో రాణించేలా చేసింది. ఒంటరి మహిళలు, వింతంతువులు, బీడీ కార్మికులకు ఆసరా అవుతూ ఆర్థిక సాయం అందిస్తున్నది. వడ్డీ లేని రుణాలు అందిస్తూ వ్యాపారంలో రాణించేలా చేస్తున్నది. కేసీఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్, అమ్మఒడి, ఆరోగ్యలక్ష్మి, గృహలక్ష్మి, సఖీ కేంద్రాలు, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ లాంటి పథకాలు అమలు చేస్తూ ప్రయోజనం చేకూరుస్తున్నది. తాజాగా.. నిరుపేద మహిళలకు రూ.3000 గౌరవ భృతి ఇస్తామని కేసీఆర్ ఎన్నికల సందర్భంగా బీఆర్ఎస్ మ్యానిఫెస్టోలో పేర్కొన్నారు. ఇప్పటికే అనేక పథకాలు అమలు చేస్తున్న గులాబీ పార్టీ మరో పథకం ప్రకటించడంపై హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి.
– ఆదిలాబాద్, అక్టోబర్ 18(నమస్తే తెలంగాణ)
నా పేరు రుద్ర బాగిర్తబాయి. మాది ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలంలోని కరంజి వద్ద గల ఇందిరానగర్. మా అత్తగారు మహారాష్ట్ర. నా భర్త, నేను కలిసి నా కూతురితో ఇక్కడే ఉంటున్నం. కూలి పని చేసుకుంటూ జీవిస్తున్నం. మాకు రేషన్ కార్డు కూడా ఉంది. మొన్న నా కూతురు పెండ్లి జేస్తే కల్యాణలక్ష్మి కింద రూ.1,00,116లు వచ్చాయి. గిప్పుడు నాసోంటి పేద మహిళలకు రూ.3 వేలు ఇస్తమని కేసీఆర్ సార్ చెప్పిండు. సీఎం సార్ మా సోంటి గరీబోళ్లకు అంతా మంచి చేస్తున్నడు. కేసీఆర్ సారే మళ్లీ సీఎం కావాలి.
ఆదిలాబాద్, అక్టోబర్ 18(నమస్తే తెలంగాణ) ః మహిళ సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుంది. కుటుంబాల పోషణలో మహిళల పాత్ర కీలకం కావడంతో వారి పేరిట పలు సంక్షేమ పథకాలను అందజేయడంతో పాటు ఉద్యోగ, ఉపాధి రంగాల్లో మహిళలను ప్రోత్సహిస్తున్నది. మహిళా సంఘాలకు రుణాలు పంపిణీ చేస్తూ వారు వివిధ రంగాల్లో వ్యాపారులు చేసుకునేలా చేయూతనందిస్తుంది. మహిళలు రాజకీయాలలో రాణించేలా వారికి స్థానిక సంస్థల ఎన్నికల్లో 50 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తున్నది. ఒంటరి మహిళలకు, వితంతువులకు, బీడీ కార్మికులకు ప్రతి నెల పింఛన్లు మంజారు చేస్తూ వారికి ఆర్థిక సాయం అందిస్తుంది. మహిళా సంఘాల సభ్యులు వడ్డీలేని రుణాలు తీసుకుంటూ వ్యాపారులు చేస్తూ వారి ఉపాధిని మెరుగుపర్చుకుంటున్నారు. కేసీఆర్ కిట్లు, కేసీఆర్ న్యూట్రిషన్ కిట్లు, అమ్మఒడి, ఆరోగ్యలక్ష్మీ, గృహలక్ష్మీ, సఖీ కేంద్రాలు, పేదింటి ఆడపిల్లల వివాహాల కోసం అమలు చేస్తున్న కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ లాంటి పథకాలు మహిళలకు ఎంతో ప్రయోజనం చేకూరుస్తున్నారు. మ హిళల రక్షణ కోసం ఏర్పాటు చేసిన షీం టీంలు ఎంతో ఉపయోగపడుతున్నాయి.
రాష్ట్ర ప్రభుత్వం మహిళల కోసం ఇప్పటికే పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తుండగా ముఖ్యమంత్రి కేసీఆర్ విడుదలు చేసిన ఎన్నికల మ్యానిఫెస్టోలో మహిళలు మరింత ప్రాధాన్యం లభించింది. సౌభాగ్యలక్ష్మీ పథకంలో భాగంగా అర్హులైన పేదకుటుంబాల మహిళలకు ప్రతి నెల రూ.3 వేల గౌరవభృతి అందజేస్తామని ముఖ్యమంత్రి కేసీఆ ర్ ప్రకటించారు. బీఆర్ఎస్ సర్కారు అందించే ఈ సాయం వారికి ఎంతో ఉపయోగపడునుంది. కుటుంబాల పోషణలో భాగంగా అవసరాల కోసం, ఇతర ఖర్చులకు సౌభాగ్యలక్ష్మీ పథకం డబ్బులు ఎంతో ఉపయోగపడుతాయని మహిళలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఎన్నో పథకాల ద్వారా వివిధ రంగాల్లో మహిళలకు చేయూతనందిస్తున్న బీఆర్ఎస్ సర్కారు మరో పథకం తీసుకురావడం సంతోషకరమైన మహిళలు అంటున్నారు.
దిలావర్పూర్ అక్టోబర్ 18: సౌభాగ్యలక్ష్మి పథకం మహిళలందరికీ వరం. ఆడబిడ్డల కు ప్రతి నెల రూ.3వేలు ఇస్తామని బీఆ ర్ఎస్ పార్టీ మ్యానిఫెస్టోలో పెట్టడం సం తోషంగా ఉంది. సీఎం కేసీఆర్ ఇచ్చిన మాటను నిలబెట్టుకునే మనసున్న గొప్ప లీడర్. గతంలో చెప్పినవే కాకుండా, చెప్పనివి కూడా చేసిండు. మహిళలందరూ ఇప్పుడు ఆర్థికంగా నిలదొక్కుకునేలా ఆయన అనేక పథకాలను అమ లు చేస్తున్నడు. ఇప్పడు కూడా చెప్పినవన్నీ చేస్తడు. సౌభాగ్యలక్ష్మి పేదోళ్లకు మంచి చేస్తది. మహిళలు అర్థికంగా నిలదొక్కుకుంటేనే కుటుంబం బాగుపడతది. అందరికీ మంచి జరుగుతది. అదే సీఎం కేసీఆర్ గుర్తించిండు.
– అక్షర, దిలావర్పూర్
మామడ, అక్టోబర్18: బీఆర్ఎస్ మ్యానిఫెస్టో పేదలకు అనూకులం గా ఉంది. ఎన్నికల అనంతరం మ హిళలందరికీ రూ.3వేల చొప్పున భృతి ఇస్తామని సీఎం కేసీఆర్ చె ప్పిన్రు. పోరాడి సాధించుకున్న రాష్ర్టాన్ని సీఎం కేసీఆర్ అన్నిరం గాల్లో అభివృద్ధి చేస్తున్నరు. మహి ళా సంక్షేమం కోసం ప్రాధాన్యమిస్తున్నరు. గ్యాస్ సిలిండర్ను రూ.400కే ఇస్తామనడం ఆనందంగా ఉంది. ఈ నిర్ణయం పేదలకు ఎంతో మేలు చేస్తుంది. పేద, మధ్య తరగతి ప్రజలు అన్ని వర్గాల వారి బాగోగుల కోసం సీఎం కేసీఆర్ నిరంతరం కృషి చేస్తున్నారు.
– పారెడి రాజ్యలక్ష్మి, పొన్కల్
ఖానాపూర్, అక్టోబర్ 18: పేదల కష్టాలు దృష్టిలో పెట్టుకొని సీ ఎం కేసీఆర్ మ్యాని ఫెస్టో ప్రకటించడం సంతోషంగా ఉంది. కూలీ, వ్యవసాయం పనులు చేసుకొని కు టుంబా న్ని పోషించుకుటున్నం. మ హిళలకు నె లకు రూ. 3 వేల జీవన భృతి ఇస్తున్నం. సీఎం కేసీఆర్ సారు హామీ ఇవ్వడం బాగుంది. జీవన భృతితో పేదలకు ఎంతో మేలు జరుగుతుంది. జీవన భృతికి శ్రీకారం చుట్టిన సీఎం కేసీఆర్ సా రుకు కృతజ్ఞతలు. బీఆర్ఎస్కు రానున్న రోజుల్లో మహిళలమంతా అండగా ఉంటం. మళ్లీ కారు గుర్తుకు ఓటు వేసి కేసీఆర్ రుణం తీర్చుకుంటం.
– పల్లెర్ల గంగవ్వ, తర్లపాడు
భైంసాటౌన్, అక్టోబర్ 18: సీ ఎం కేసీఆర్ విడుదల చేసిన మ్యానిఫెస్టో చాలా బాగుంది. ముఖ్యంగా మహిళలకు సౌభా గ్యలక్ష్మి పేరిట ప్రతినెలా రూ. 3 వేల భృతి కల్పించడం గొప్ప వ రం. మాలాంటి పేదోళ్లకు సీఎం కేసీఆర్ ఇచ్చే బహుమానం గృ హలక్ష్మి, ఆరోగ్యలక్ష్మి, కళ్యాణలక్ష్మి, స్త్రీ నిధి వంటి పథకా లతో మహిళలకు ఎంతో లబ్ధి చేకూరింది. ఇప్పటికే మహిళ లంతా స్త్రీ నిధి ద్వారా ఆయా వ్యాపారాల్లో రాణించి ఆర్థికం గా బ లపడుతున్నారు. ఇప్పుడు మహిళా స్వశక్తి గ్రూపులకు సొంత భవనాలు నిర్మిస్తామనడం గర్వించదగ్గ విషయం. ఇదో గొప్ప నిర్ణయం.
– గోదావరి బాయి, భైంసా
తాంసి, అక్టోబర్ 18: సీఎం కే సీఆర్ అంటే రాష్ట్ర ప్రజలకు ఓ నమ్మకం. ఆయన మాట ఇస్తే త ప్పే వ్యక్తి కాదు. పెరి గిన నిత్యా వసరధరలతో సామాన్యులు చా లా ఇబ్బంది పడుతున్నారు. ప్ర తి నెలా సరుకులు కొనాలంటే భారంగా ఉంది. పేద మహిళల కష్టాలు అర్థం చేసుకొని సౌభాగ్యలక్ష్మితో రూ.3 వేలు ఇస్తామని బీఆర్ఎస్ ఎన్నికల మ్యానిఫెస్టోలో ప్రకటించడం ఆనందం గా ఉంది. లక్షలాది కుటుంబాలకు ఎంతో మేలు జరుగు తుంది. గత ఎన్నికల్లో హామీ ఇవ్వకు అనేక పథకాలు తీ సుకువచ్చి అమలు చేసిండు. దీంతో రాష్ట్ర ప్రజలకు బీఆర్ ఎస్ ప్రభుత్వంపై నమ్మకం కుదిరింది. ఒక వర్గం అని కాకుం డా ప్రజలందరికీ ఆమోదయోగ్యమైన పాలన అందించి రెం డు దఫాలుగా అధికారంలోకి వచ్చి రుజువు చేసుకున్నాడు. మూడోసారి కూడా ఆయనే సీఎం కావాలి. అట్లయితనే పే దలు, మహిళలు, అన్ని వర్గాల ప్రజలు బాగుపడుతరు. సౌభాగ్యలక్ష్మి పథకం ప్రతి కుటుంబంలో వెలుగులు నింపడం ఖాయం
– దర్శనాల సునీత, పొన్నారి
తాంసి, అక్టోబర్ 18: సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన బీఆర్ఎస్ ఎన్నికల మ్యానిఫెస్టో అన్ని వర్గాల ప్రజలను ఆక ట్టుకునేలా ఉంది. తెల్ల రేషన్ కార్డుదారులకు కేసీఆర్ బీమా పథకం చాలా బాగుంది. అలాగే నిరుపేదల మహి ళల కోసం సౌభాగ్య లక్ష్మి పథకంతో రూ.3 వేలు ఇస్తామనడం అభినందనీయం. మ హిళాలోకానికి బతుకమ్మ పండుగ ముందే వచ్చినట్లు ఉంది. గతంలో ఇంత మంచి ఆలోచన ఏ పార్టీ చేయలేదు. ప్రజలు బీఆర్ఎస్ పాలననే కోరుకుంటున్నారు. ఈపథకంతో బీఆర్ఎస్ పార్టీ చిరస్థాయిగా నిలిచిపోతుంది.
– ప్రేమల, గృహిణి, హస్నాపూర్, మండలం తాంసి
మా కులవృత్తితో పాటు కూలినాలీ చేస్తుంటాం. నా భర్త ఈశ్వర్ , నేను కలిసి వృత్తి పని చేసుకుంటం. మాకు ముగ్గురు ఆడపిల్లలు కాగా ఇద్దరి పెళ్లిళ్లయ్యాయి. చిన్న బిడ్డ చదువు కుంటున్నది. ఒకరికి కళ్యాణలక్ష్మి వచ్చింది. ఇంకో బిడ్డకు దరఖాస్తు చేసినం. సీఎం కేసీఆర్ సారు సౌభాగ్యలక్ష్మి పథకం ఇస్తమని చెప్పిన్రు. ఈ పథకం కింద మాకు , మాతోటి పేదల కు నెలకు రూ 3 వేలు అందించడం మామూలు మాట కాదు పేదోళ్ల ఇంట్లో ఈ పథకం దీపం అయితది. మా గ్రామంలనే నూరుమందికి ఎక్కువ సౌభాగ్యలక్ష్మి వస్తది.
– కొండూర్ గంగమ్మ, ఇందిరానగర్, భీంపూర్ మండలం