హనుమంతుడు లేని ఊరు లేదు.. బీఆర్ఎస్ సర్కారు సంక్షేమ పథకాలు అందని ఇల్లు లేదు.. అంతలా సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికీ చేరాయి. గడప గడపకూ దాదాపు రెండు నుంచి మూడు పథకాలు అందాయి. దీనికి అభివృద్ధి తోడవడంతో పల్లెలు ప్రగతి పథంలో దూసుకెళ్లాయి. ఆసరా పింఛన్లు, కల్యాణలక్ష్మి, రైతుబీమా, రైతుబంధు, రుణమాఫీ, వ్యసాయానికి ఉచిత విద్యుత్, దళితబంధు, సబ్సిడీపై గొర్రెలు, కేసీఆర్, న్యూట్రిషన్ కిట్స్ వంటి పథకాలు పేదలకు వరంగా మారాయి. వీటినే బీఆర్ఎస్ అభ్యర్థులు ప్రచారాస్ర్తాలుగా వాడుతున్నారు. పదేండ్లలో సాధించిన గణనీయమైన ప్రగతిని వివరిస్తున్నారు.
బీఆర్ఎస్ పాలనలో సంక్షేమ పథకాలు గడప గడపకూ చేరాయి. అభాగ్యులకు ‘ఆసరా’ అవుతుండగా.. గొల్ల కుర్మలకు సబ్సిడీ గొర్రెలతో ఉపాధి దొరుకుతోంది. పేదింటి ఆడబిడ్డల పెండ్లిళ్లకు కల్యాణలక్ష్మితో కల్యాణకాంతులు నిండుతున్నాయి. అన్నదాతలకు రుణమాఫీ మొదలుకొని రైతుబంధు, రైతుబీమా వంటి పథకాల వరకు ప్రతి గ్రామంలోని ప్రతి ఇంట్లో అన్నదాతలకు కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలు పలకరిస్తూనే ఉన్నాయి. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పల్లెబాట పట్టిన బీఆర్ఎస్ అభ్యర్థులు కోవ లక్ష్మి, కోనేరు కోనప్ప ప్రభుత్వం అమలు చేసిన పథకాలను ప్రచారం చేస్తున్నారు. పదేళ్ల కాలంలో గణనీయమైన ప్రగతి సాధించామని వివరిస్తున్నారు.
– కుమ్రం భీం ఆసిఫాబాద్, అక్టోబర్ 25(నమస్తే తెలంగాణ)
మారుతున్న కాలానికి అనుగుణంగా కటింగ్ షాపుల నిర్వహణలోనూ మార్పులు వచ్చాయి. మాకు కరెంటు బిల్లు నెలకు 400-500 వరకు వస్తోంది. ప్రభుత్వం 250 యూనిట్ల వరకు ఉచితంగా ఇవ్వడంతో మాపై విద్యుత్ భారం తగ్గింది. గతంలో కత్తెర, కత్తితో మాత్రమే కటింగ్, గడ్డాలు తీసేవాళ్లం. ఇప్పుడు కటింగ్లో కొత్త విధానాలు వచ్చాయి. దీంతో సాంకేతిక విధానాలను అవలంబించాల్సి వస్తోంది. దీంతో కటింగ్ దుకాణాల్లో విద్యుత్ వినియోగం బాగా పెరిగింది. సీఎం కేసీఆర్ మాకు ఉచిత విద్యుత్ ఇచ్చి మాపై ఆర్థిక భారాన్ని తగ్గించారు. చేతివృత్తులపై ఆధారపడే వారికి రాయితీలు కల్పిస్తున్నారు.
– రజనీకాంత్, కటింగ్షాపు, ఆసిఫాబాద్.
ప్రభుత్వం 250 యూనిట్ల విద్యుత్ ఉచితంగా ఇవ్వడంతో మాపై కరెంటు భారం తగ్గిం ది. ఇస్త్రీ చేయడానికి చాలా కరెంటు అవసరమవుతోంది. గతంలో బొగ్గుల ఇస్త్రీ పెట్టెలను వాడేవా ళ్లం. బొగ్గులకు బాగా ఖర్చు వచ్చేది. ప్రభుత్వం మాకు 250 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తుండడంతో మేము కూడా ఇస్త్రీ మిషన్ను వాడే అవకాశం కలిగింది. మాకు ఆర్థిక భారంతోపాటు శ్రమ కూడా తగ్గింది. ముఖ్యమంత్రికి రుణపడి ఉంటాం.
– లచ్చన్న, ఇస్త్రీ షాపు, ఆసిఫాబాద్.
నాకు మూడున్నరెకరాల వ్యవసాయ భూమి ఉన్నది. యాసంగి రైతుబంధు డబ్బులు గత నెలలో నా అకౌంట్లో పడ్డా యి. ఆ డబ్బులతో యాసంగి ఎవుసం పనులు చేసిన. కేసీఆర్ సారు రైతుబంధు పథకం పెట్టి పెట్టుబడి సాయం ఇస్తుండడం వల్ల బాగా లాభం అవుతు న్నది. మునుపు ఎవుసానికి ముందే షావుకార్ల దగ్గరికి వెళ్లి వడ్డీకి పైసలు తెచ్చుకునేది. పండిన పంటలో ఎక్కువ పైసలు షావుకార్లకే పోయేవి. కానీ.. గిప్పుడు షావుకార్లకు పోకుండా పండించిన పంట ఫలితం మొత్తం రైతుకే దక్కేటట్టు కేసీఆర్ సారు చేసిండు. గిట్ల రైతులను సంతోష పెడుతున్న గా సారు చల్లగా ఉండాలి.
– గుర్నులే పోశయ్య, రైతు, కుశ్నపల్లి.
ప్రభుత్వం అందించిన దళితబంధు పథకంతో నేను ప్రారంభించిన బిజినెస్ని నేను ఉద్యోగం పొందిన విధంగానే భావిస్తున్నా. నేను ఎంబీఏ చదువుకున్నా. కొంతకాలం హైదరాబాద్లోని మార్కెటింగ్ ఫీల్డులో పనిచేశా. నెలకు రూ.24 వేల వేతం ఇచ్చేవారు. మా అమ్మ అనారోగ్య కారణాల దృష్ట్యా నేను ఆ ప్రైవేటు ఉద్యోగాన్ని మానేశా. ప్రభుత్వం దళితబంధు కింద రూ.10 లక్షలు అందించింది. ఈ డబ్బులతో ఫ్లెక్సీ ప్రింటింగ్ యూనిట్ పెట్టా. దళితబంధు రూపంలో సీఎం కేసీఆర్ నిరుద్యోగులకు మంచి ఉపాధిని కల్పిస్తున్నారు. నేను ఉద్యోగానికి వేచి చూడాల్సిన పనిలేదు. వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకొని ప్రభుత్వ ఉద్యోగం కంటే అధిక డబ్బులు సంపాదిస్తా.
– దుర్గం శ్రీకాంత్, పులికుంట, రెబ్బన మండలం.
నాకు రెండెకరాల భూమి ఉన్నది. ఎక్కడా లేని విధంగా రైతుబంధు, రైతుబీమా ప్రవేశపెట్టి పండిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మద్దతు ధరకు రాష్ట్ర సర్కారు కొంటున్నది. నాకు యేటా రెండెకరాల భూమికి రూ.20 వేలు అందుతున్నవి. ఈ డబ్బులను సాగుకు పెట్టుబడిగా పెడుతున్న. గతంలో అప్పులు చేసి సాగు చేసేవాడిని. గిప్పుడు రైతుబంధు ఇస్తుండడంతో అప్పులు చేయాల్సిన అవసరం లేకుండా పోయింది. పెట్టుబడి సాయం అందిస్తున్న ముఖ్యమంత్రికి రుణపడి ఉంటా.
– నగేశ్, రైతు, పెంచికల్పేట్, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా.
నేను ఎంఏ(ఇంగ్లిష్) చదివా. టీటీసీ కూడా చేశా. గతంలో డీఎస్సీ రాశా. నాలుగు మార్కులతో టీచర్ ఉద్యోగం కోల్పోయా. మా అమ్మ పేరిట ఉన్న 75 సెంట్ల భూమిలో వ్యవసాయం చేసుకుంటూ ఉపాధి హామీ పథకంలో క్షేత్ర సహాయకునిగా పని చేశా. ఉద్యోగం వదిలి ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నా. కేసీఆర్ దయవల్ల నాకు దళితబంధు ద్వారా రూ.10 లక్షల యూనిట్ మంజూరైంది. ఈ డబ్బులతో మా మండల కేంద్రం బెజ్జూర్లో హార్డ్వేర్ కం ఎలక్ట్రీకల్ షాపు పెట్టుకున్నా. షాపు పెట్టినప్పటికి గిరాకీ మంచిగా అవుతోంది. ఇక నేను ప్రభుత్వ ఉద్యోగానికి ఎదురు చూడాల్సిన అవసరం లేదు. దళితబంధుతో పెట్టుకున్న దుకాణంతో నెలకు కనీసం రూ.20 వేల నుంచి రూ.25 వేల వరకు సంపాదిస్తున్నా. రాబోయే రోజుల్లో వ్యాపారాన్ని విస్తరించుకునే ఆలోచన ఉంది. సీఎం కేసీఆర్ దళితబంధు రూపంలో నాకు ఉద్యోగం కల్పించినట్లుగానే భావిస్తున్నా. – దుర్గం రవీందర్, దళిబంధు లబ్ధిదారు, బెజ్జూర్.