ఎదులాపురం, నవంబర్ 30 : విద్యార్థులు క్రీడల్లో ఉత్సాహంగా పాల్గొని రాణించాలని ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ పేర్కొన్నారు. పట్టణంలోని ఇందిరా ప్రియదర్శిని స్డేడియంలో ఎస్సీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి క్రీడా పోటీలను బుధవారం కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ సిక్తా పట్నాయక్ మాట్లాడుతూ.. ఎస్సీ సంక్షేమ వసతి గృహాల్లో 5 నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న వి ద్యార్థినీ విద్యార్థులకు ప్రభుత్వ ఆదేశాల ప్రకా రం క్రీడాపోటీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. జిల్లాలోని 18 ఎస్సీ వసతి గృహాల్లోని విద్యార్థులకు పరుగుపందెం, వాలీవాల్, ఖోఖో, కబడ్డీ, క్యారం పోటీలు నిర్వహిస్తుండగా, సుమారు 300 మంది పాల్గొంటున్నట్లు పేర్కొన్నారు.
ఉ త్సాహవంతంగా పాల్గొని క్రీడా స్ఫూర్తి చాటాలని, వసతి గృహాలకు పేరు తేవాలని ఆకాంక్షించారు. అనంతరం పరుగు పందెం, వాలీవాల్, ఖోఖో, కబడ్డీ, క్యారం పోటీలను టాస్ వేసి ప్రా రంభించారు. వాలీబాల్ ఆడి పోటీలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్సీ సం క్షేమ అధికారి సునీత కుమారి, డీఈవో ప్రణీత, డీవైఎస్వో వెంకటేశ్వర్లు, సహాయ సంక్షేమ అధికారి నారాయణరెడ్డి, సూపరింటెండెంట్ పూర్ణచందర్, హెచ్డబ్ల్యూలు దత్తు, శ్రీనివాస్, పీడీ, పీఈటీలు, విద్యార్థులు పాల్గొన్నారు.