సోన్, జూలై 21: గోదావరిపై నిర్మించిన శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి రెండు రోజుల నుంచి భారీగా వరద వచ్చి చేరుతుండడం తో సరస్వతీ ఆయకట్టుకు సాగునీటి భరోసా కలిగింది. 15 రో జుల క్రితం వరకు గోదావరిలోకి వరద రాకపోవడంతో ప్రభుత్వం కాళేశ్వరం నీటిని శ్రీరాంసాగర్కు ఎత్తిపోయడంతో ప్రాజెక్టులోకి నీరు వచ్చే క్రమంలో వర్షాలు మొదలయ్యాయి. దీంతో కాళేశ్వరం నీటి ఎత్తిపోతలను తాత్కాలికంగా ప్రభుత్వం ఆపివేయడంతో ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్టులోకి పెద్ద మొత్తంలో వరద వచ్చి చేరుతోంది. మహారాష్ట్రతో పాటు నిజామాబాద్, మంజీర, గోదావరి పరీవాహక ప్రాంతాల్లో గత మూడు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు శ్రీరాంసాగర్ నీటి కళను సంతరించుకున్నది. శ్రీరాంసాగర్ పూర్తి నీటిమట్టం 1091 అడుగులు కాగా, వర్షాకాలం ప్రారంభానికి ముందు 1060 అడుగుల వద్ద ఉండడంతో గత మూడు రోజుల నుంచి సుమారు 15 అడుగులు పెరిగి 1076 అడుగులకు చేరుకుంది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వరద పెద్ద మొత్తంలో వస్తుండడంతో మరో రెండు, మూడు రోజుల్లో 1080 అడుగుల వద్దకు చేరుకోవచ్చని, వర్షాలు ఇలాగే కొనసాగితే ప్రాజెక్టు పూర్తినీటిమట్టం చేరుకునే అవకాశం ఉందని ఎస్సారెస్పీ అధికారులు ధీమా వ్య క్తం చేస్తున్నారు.
ఆయకట్టుకు రంది లేదిక..
శ్రీరాంసాగర్ ఎడమకాలువ అయిన సరస్వతీకెనాల్ ద్వారా నిర్మల్ జిల్లాలో 36వేల ఎకరాల ఆయకట్టు సాగు కానుంది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు సరస్వతీ కెనాల్ నీటి పంపిణీకి కనీస నీ టి మట్టం 1045 అడుగులు కాగా, ఇప్పటికే 1076 అడుగులకు చేరుకోవడంతో సరస్వతీ కెనాల్కు పూర్తిస్థాయిలో సాగునీరందించే అవకాశాలున్నాయి. సరస్వతీ కెనాల్ కింద సోన్, నిర్మల్ రూరల్, మామడ, లక్ష్మణచాంద, ఖానాపూర్, కడెం, పెంబి మండలాలో పంటలు సాగు చేస్తారు. గ్రామాల్లో చెరువులు నింపి యాసంగి, వానకా లం పంటలకు సాగునీరందించేందుకు ఎస్సారెస్పీ నీరే ఆధారం. ప్రస్తుతం ప్రాజెక్టులో నీరు నిండుకోవడంతో ఈ ప్రాంత రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వారం రోజుల క్రితం వరకు శ్రీరాంసాగర్లోకి వరద రాకపోవడంతో ఆయకట్టు సాగుపై ఆందోళన చెందారు. ఇప్పటికే సరస్వతీ కెనాల్ కింద ఆయా గ్రామాల్లో నారు మళ్లను పో సుకుని బురద దుక్కులు దుక్కుకొని వరి నాట్లకు సిద్ధమవుతున్న రైతులకు వర్షాలు ఎంతో సహకరించాయి. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నిండితే బావులు, బోర్లలో భూగర్భజలాలు పు ష్కలంగా పెరిగే అవకాశం ఉండడంతో. ఇక మరో రెండు పంటలకు ఢోకాలేదని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే సాగుపనుల్లో బిజీగా ఉన్నారు.
వరి పంటకు ఢోకా లేదు..
గత మూడు రోజుల నుంచి గోదావరి ఎగువ ప్రాంతంలో వర్షాలు కురుస్తుండడంతో శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి భారీగా వరద వచ్చి చేరుతోంది. ఇక ఈ ఖరీఫ్ సీజన్ లో సరస్వతీ కెనాల్కు పూర్తిస్థాయిలో నీరు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే మా గ్రామంలో వరినాట్లను పొసుకుని పొలం నాటు వేసుకునేందుకు సిద్ధమవుతున్నాం. సరస్వతీ కెనాల్ వద్ద నుంచి నీటితో ఇక ఈ ఏడాది కూడా మా పంటలకు ఢోకా లేదు. మా కష్టాలు తీరినట్లే.
-రమేశ్రెడ్డి, రైతు, పాక్పట్ల