రాష్ట్ర ప్రభుత్వం మహిళల భద్రతే లక్ష్యంగా ముందుకెళ్తున్నది. ఈ మేరకు సఖీ కేంద్రాలను ఏర్పాటు చేసి వారికి భరోసానిస్తున్నది. టోల్ఫ్రీ నంబర్ ‘181’ను అందుబాటులోకి తీసుకురాగా, వివిధ సమస్యలతో ఫోన్ చేసిన వారిని సిబ్బంది అక్కున చేర్చుకొని అండగా నిలుస్తున్నది. కట్టుబట్టలతో వచ్చి తాత్కాలిక వసతి పొందే మహిళలకు రూ. 2 వేల విలువ గల వెల్కమ్ కిట్లు అందజేస్తున్నది. ఇప్పటి వరకు మంచిర్యాల సఖీ కేంద్రంలో 840 కేసులు నమోదు కాగా, కౌన్సెలింగ్ ద్వారా అనేక కేసులకు పరిష్కారం చూపింది.
మంచిర్యాల అర్బన్, ఆగస్టు 12 : గృహ హింస, వరకట్నం, లైంగిక దాడులు, పోక్సో తదితర సమస్యలు ఎదుర్కొంటున్న మహిళలకు సఖీ కేంద్రం అండగా నిలుస్తున్నది. మహిళా శిశు సంక్షేమ శాఖ, ప్రకృతి పర్యావరణ సంస్థ ఆధ్వర్యంలో జిల్లాలో 2019, ఏప్రిల్ 1న సఖీ కేంద్రం ప్రా రంభించారు. అప్పటి నుంచి 24 గంటలు సేవలు అందిస్తోంది. ఇప్పటి వరకు వివిధ కమ్యూనిటీలకు చెందిన మహిళల నుంచి 840 ఫిర్యాదులు రిజిష్టర్ అయ్యాయి. ఇందులో ఓసీ వర్గానికి చెందిన మహిళల నుంచి 50 ఫిర్యాదులు, బీసీలు 445, ఎస్సీలు 268, ఎస్టీలు 66, ఇతరులు 11 మంది ఫిర్యాదు చేశారు. కట్టుబట్టలతో వచ్చి సఖి కేంద్రంలో తాత్కాలిక వసతి పొందే మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 2 వేల విలువ గల వెల్కమ్ కిట్ను అందజేసి అండగా నిలుస్తుంది.
బాధితులకు భరోసాగా…
గృహహింస, పని చేసే చోట, విద్యా సంస్థలలో లైంగిక వేధింపులు, లైంగికదాడులు, స్త్రీలు, పిల్లల అక్రమరవాణా, యాసిడ్ దాడులు, ఇతరత్రా హింసలకు గురైన బాధితులకు సఖీ కేంద్రం అండగా నిలుస్తోంది. బాధితు ల కోసం 181 టోల్ఫ్రీ నంబర్ అందుబాటులోకి కూడా తీసుకొచ్చిం ది. ఇబ్బందులు, వేధింపులు, దాడులు ఎదుర్కొంటున్న మహిళ లు, యువతులకు ఎలాంటి సమస్య ఎదురైనా ఒక్క ఫోన్ కాల్(టోల్ ఫ్రీ నంబర్ 181 లేదా 08736 250181 లేదా 84988 23095)తో న్యాయ నిపుణులను సంప్రదించి సలహాలు, సూచనలు అందజేస్తోంది.
అత్యవసర సేవలు…
‘సఖీ’పై విస్తృత ప్రచారం…
అత్యాచారాలు, వేధింపులు, లైంగిక దాడులు, ఇతర ఘటనలపై ఎక్కడ, ఎలా ఫిర్యాదు చేయాలో తెలియని గ్రామీణ, పట్టణ మహిళలకు ‘సఖీ’ అందుబాటులో ఉందనే విషయంపై విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నారు. ఇలా ఇప్పటి వరకు 198 అవగాహన సమావేశాలు, కార్యక్రమాలు నిర్వహించి సఖీ సేవలు, చట్టాల గురించి వివరించారు. ముఖ్యంగా స్కూళ్లు, కాలేజీలు, ఆరోగ్య కేంద్రాలు, పని ప్రదేశాల్లో లైంగిక వేధింపులు, షాపింగ్మాల్స్, సూపర్ మార్కెట్లు, మండల, జిల్లా సమాఖ్య సంఘాల సమావేశాలు.., ఇలా మహిళలు ఉండే ప్రదేశాలలో సఖీ సేవల గురించి వివరిస్తున్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో అంగన్వాడీ టీచర్లు, కళాశాలల ప్రిన్సిపాల్స్ సహకారంతోనూ సఖీ గురించి అవగాహన కల్పిస్తున్నారు. ఇప్పటి వరకు 37,232 మందికి అవగాహన కల్పించారు.
వెల్కమ్ కిట్లు అందజేత…
కట్టుబట్టలతో సఖీ కేంద్రానికి వచ్చే వారికి ఆశ్రయం, భోజన వసతి కల్పించడమే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం రూ. 2 వేల విలువైన 28 ఐ టంలతో కూడిన కిట్ను అందజేస్తుంది. ఇందులో లగేజ్ బ్యాగ్, సా రీస్, సారీ పెటికోట్, లైనింగ్ పాల్స్, టాప్స్, లెగ్గింగ్స్, చున్నీస్, పెట్టికో ట్స్, పాంటీస్, ఫేయిర్ అండ్ లవ్లీ, పౌడర్, అద్దం, నూనె, గాజులు, టూ త్ పేస్ట్, టూత్ బ్రష్, సంతూర్ సోప్, డిటర్జెంట్ సోప్, టిక్లీస్, స్టేఫ్రీ, డిటర్జెంట్ పౌడర్, టవల్, ఖర్చీఫ్, షాంపూస్, స్లిప్పర్స్, హేర్ బాండ్, నైటీస్ ఉంటాయి. ఇప్పటివరకు 73 మంది వెల్కమ్ కిట్లు అందజేశారు.
వివిధ డిపార్లుమెంట్ల నుంచి ఫిర్యాదులు..
సఖీ కేంద్రం నిర్వాహకులు వివిధ డిపార్టుమెంట్ల నుంచి ఫిర్యాదులు స్వీకరించి వాటిని పరిష్కరిస్తున్నారు. ఇప్పటి వరకు 840 ఫిర్యాదులు అందగా, ఇందులో 181 కాల్ ద్వారా 112 ఫిర్యాదులు వచ్చాయి. అలాగే పోలీస్ స్టేషన్ల నుంచి 300, డీడబ్ల్యూవో ద్వారా 19, కలెక్టరేట్ నుంచి 13, నేరుగా (వ్యక్తిగతంగా) 365, కోర్టు నుంచి మూడు, ఇతర సఖి కేంద్రాల నుంచి ఆరు, సీడబ్ల్యూసీ నుంచి తొమ్మిది, అంగన్ వాడీ నుంచి, ముష్కాన్, స్వాధార్, ఎన్జీవోల నుంచి ఒక్కొక్కటి, డీసీపీ నుంచి మూడు, మహిళా కమిషన్ నుంచి 6 ఫిర్యాదులు అందాయి.
జిల్లాలో 840 కేసులు నమోదు
వివిధ డిపార్టుమెంట్ల నుంచి 840 కేసులు నమోదయ్యాయి. ఇందులో గృహ హింస కేసులు 443 రాగా, రెండు మానభంగం కేసులు, రెండు లైంగిక దాడి, రెండు అమ్మాయిల అక్రమ రవాణా, 19 పోక్సో, 11 బాల్య వివాహాలు, 89 మిస్సింగ్, కిడ్నాప్ కేసులు, 73 సైబర్ క్రైం, ప్రేమ వివాహాలు, చీటింగ్ కేసులు, 113 వరకట్నం వేధింపులు, 86 ఇతర కేసులు (498ఏ, ఆస్తి, ఈవ్ టీజింగ్, దొంగతనం, వృద్ధుల, పారిపోయిన, చైల్డ్ కస్టడీ) నమోదయ్యాయి.
అందించిన సేవల వివరాలు..
సఖీ కేంద్రాన్ని ఆశ్రయించిన వారికి అవసరమైన సేవలను సభ్యులు అందిస్తున్నారు. ఇప్పటి వరకు జిల్లాలో 840 కేసులు నమోదు కాగా, వీటిలో 132 కేసులు ఇరు వర్గాల పెద్దలకు కౌన్సెలింగ్లు నిర్వహించగా విత్ డ్రా చేసుకున్నారు. అలాగే 68 కేసులు పరిష్కారం చేశారు. మరో 382 మంది రాజీ కుదుర్చుకున్నారు. కౌన్సెలింగ్ అనంతరం కూడా మా ర్పు రాని 86 కేసులు పోలీస్ స్టేషన్లకు రెఫర్ చేశారు. నలుగురిని స్వధా ర్ గృహానికి పంపించారు. ఏడు కేసులను ప్రజావాణికి, ఎస్సీ ఫోరంకు, 41 కేసులు సీడబ్ల్యూసీ, చైల్డ్ లైన్కు, ఒక్కొక్కరి చొప్పున నలుగురిని ఇతర సఖీ కేంద్రానికి, స్వధార్ గృహానికి, అనాథ ఆశ్రమానికి, ఇతర ఆశ్రమానికి పంపించారు. మరో 117 కేసులు ప్రగతి దశలో ఉన్నాయి.
24/7.. బాధిత మహిళలకు అందుబాటులో..
మహిళలు, బాలికలు, యువతుల సమస్యలపై 181 నంబర్ ద్వారా సఖీ కేంద్రానికి ఫోన్ వచ్చిన వెంటనే సేవలు అందిస్తున్నాం. సఖీ కేంద్రానికి వచ్చే బాధితులకు అండగా ఉంటున్నాం. బయటకు చెప్పుకోలేని సమస్యలతో బాధపడే వారికి ఆశ్రయం కల్పిస్తున్నాం. ఇప్పటి వరకు ఇలాంటి కేసులు 840 రాగా వాటిని పరిష్కరించాం. 24 గం టలు అందుబాటులో ఉంటున్నాం. వసతి పొందుతున్న వారికి వెల్కమ్ కిట్లు అందజేస్తున్నాం. అత్యవసర సమయాలలో 08736 250 181 లేదా 84988 23095 నంబర్లలో సంప్రదించవచ్చు.
– శ్రీలత, సఖీ కేంద్రం నిర్వాహకురాలు, మంచిర్యాల
అండగా ఉంటున్నాం
ఆపదలో వచ్చిన మహిళలకు అండగా ఉంటున్నాం. కాలేజ్రోడ్లో రూ. 48 లక్షలతో నూతన భవనం నిర్మించి బాధితుల కోసం కౌన్సెలింగ్, రెస్ట్ రూం తదితరాలతో అందుబాటులో ఉంచాం. భవనం చుట్టూ రూ. 9 లక్షలతో కంపౌండ్ వాల్ నిర్మాణం చేయిస్తున్నాం. సఖీ కేంద్రానికి వచ్చే వారికి అన్ని రకాలుగా అందుబాటులో ఉంటూ సలహాలు, సూచనలు ఇస్తూ వారికి మనో ధైర్యం కల్పిస్తున్నాం. ఆపదలో 181కు కాల్ చేస్తే తక్షణ సహాయం అందుతుంది.
– చిన్నయ్య, జిల్లా సంక్షేమ అధికారి, మంచిర్యాల