భీమారం, డిసెంబర్ 28 : మంచిర్యాల జిల్లా భీమారం మండలం బూర్గుపల్లి గ్రామ శివారులోని కిష్టయ్య చెరువును కబ్జా దారుల నుంచి కాపాడాలని స్థానిక తహసీల్దార్ విశ్వంబర్తో పాటు ఎస్ఐ రాజావర్ధన్కు ఆయకట్టు రైతులు గురువారం వినతిపత్రం అందజేశారు. అనంతరం వారు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కొందరు చెరువుకు గండి కొట్టే ప్రయాత్నాలు చేస్తున్నారని, ఆ చెరువు కింద 100 మంది రైతులు 50 ఎకరాల్లో సాగు చేసుకొని జీవనం సాగిస్తున్నారన్నారు.
మిషన్ కాకతీయ కింద చెరువుకు మరమ్మతు చేయడంతో యేటా రెండు పంటలు పండించుకుంటున్నట్లు వారు తెలిపారు. ఆ చెరువుకు హద్దులు నిర్ణయించాలని, కబ్జాకు యత్నిస్తున్నవారిపై చర్యలు తీ సుకోవాలని కోరారు. ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీ సుకెళ్లన్నుట్లు వారు తెలిపారు. తహశీల్దార్ విశ్వంబర్ మాట్లాడుతూ కబ్జాదారులు ఎంతటివారైనా చట్ట పరం గా చర్యలు తీసుకుంటామని, సర్వే చేసి చెరువు హద్దులు నిర్ణయిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రైతులు నీలాల లక్ష్మి, సపోట పెద్దరాములు, సపోట చిన్న రాములు, ధరావత్ రాములు, భూక్యరాములు, భూక్య వినోద్, సపోట రాజబాపు, సపోట తోల్చ ఉన్నారు.