కుమ్రం భీం ఆసిఫాబాద్, మార్చి 11 (నమస్తే తెలంగాణ) : పల్లె ప్రజలకు ఆహ్లాదం పంచేందుకు కేసీఆర్ సర్కారు ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతి వనాలు అధికారుల నిర్లక్ష్యంతో కళావిహీనంగా మారాయి. కోట్లాది రూపాయలు వెచ్చించి జిల్లాలోని 335 గ్రామాల్లో పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు చేసి, వాకింగ్ ట్రాక్లతో పాటు చల్లని వాతావరణం కోసం అనేక రకాల మొక్కలు పెంచింది.
చిన్నారులు ఆడుకోవడానికి పరికరాలు సైతం అందుబాటులోకి తీసుకొచ్చింది. గుట్టలు, బండలపై జంతువులు, ఇతర అందమైన బొమ్మలు వేయించి అందంగా తీర్చిదిద్దింది. ఈ క్రమంలో సర్కారు మారడం.. అధికారులు పట్టించుకోకపో వడంతో మొక్కలన్నీ ఎండిపోయి అధ్వానంగా దర్శనమిస్తున్నాయి. ఇకనైనా అధికారులు స్పందించాలని ప్రజలు కోరుతున్నారు.