గ్రామీణ వారసంతలకు ఆదరణ పెరుగుతున్నది. ఆధునిక టెక్నాలజీతో ఇంటి వద్దకే సరుకులు చేరుస్తున్న కార్పొరేట్ కంపెనీలకు దీటుగా, సూపర్ మార్కెట్లో దొరికే వస్తువులను గ్రామీణ పేదలకు అందుబాటు ధరల్లో లభిస్తున్నాయి. గ్రామాల్లోనే రైతులు, కూలీలకు అనుకూలమైన సమయంలో కావాల్సిన సరుకులు వారసంతల్లో అమ్ముతూ వ్యాపారులు ఉపాధి పొందుతున్నారు. యువతకు ఉపాధి దొరకడంతో పాటు తైబజార్లతో పంచాయతీలకు ఆదాయం సమకూరుతున్నది. దీంతో గ్రామీణ వారసంతలకు ప్రజాదరణ లభిస్తున్నది. పట్టణ, పల్లె తేడా లేకుండా జిల్లా వ్యాప్తంగా ఉన్న గ్రామాల్లో వారంలో ఏదో ఒక రోజు వారసంతలు జరుగుతున్నాయి.
నేరడిగొండ, జనవరి 29 : మండలంలోని వాంకిడి, నేరడిగొండ గ్రామా ల్లో వారంలో ఒక రోజు వారసంత నిర్వహిస్తు న్నారు. దీంతో కూలీలు, వ్యవసాయకూలీలు, వినియోగదారులు, రైతు లు తమకు అవసరమైన వస్తువులు తక్కువ ధరలో దొరు కుతుండడంతో వార సంతల్లో కొనుగోలు చేస్తున్నారు.
గ్రామాల్లో కూరగాయలు పండిస్తున్న రైతులు ఉన్న గ్రామంలోనే వారసంతలో విక్రయిస్తూ ఆదాయం పొందుతున్నారు. రవాణా మధ్యవర్తులకు కమిషన్ ఖర్చులు లేకపోవడంతో లాభాలు వస్తున్నాయి. గ్రామీ ణులకు తక్కువ ధరకే కూరగాయలు లభిస్తున్నాయి.
వారసంతల్లో నిరుద్యోగులు పండ్లు, మసాలా దినుసులు, బట్టలు, చెప్పులు, స్టీలు, సామగ్రి అమ్ముతూ ఉపాధి పొందుతున్నారు. వ్యాపా రుల నుంచి తైబజారు వసూలు చేస్తూ పంచాయతీలు ఆదాయం సమకూర్చుకుంటున్నాయి.
నేరడిగొండలో నిర్వహిస్తున్న వారసంతలో సౌకర్యా లు కల్పిం చాలని రైతులు, వ్యాపారులు కోరుతున్నారు. రోడ్ల వెంబడి వారసంత నిర్వహిస్తుండడంతో వ్యాపారులు, వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారు. వారసంతకు స్థలం కేటాయించి, తాగునీరు, మూత్రశా లలు ఏర్పాటు చేయాలని స్థానికులు, వ్యాపారులు కోరుతున్నారు.
వారసంతలు ప్రతి రోజూ ఏదో ఒక గ్రామంలో నిర్వహిం చడంతో చిన్నపాటి వ్యాపారం చేసుకుంటూ ఉపాధి పొందు తున్నా. వారసంతల్లోనే ప్రజలు సామగ్రి కొనుగోలు చేస్తున్నా రు. గిరాకీ బాగానే ఉంటుంది. ప్రజల్లో మార్పు వచ్చింది. స్థానికంగా రైతులు, వ్యాపారుల వద్దే సరుకులు కొంటున్నారు.
– కిష్టయ్య, వ్యాపారి
మేము పండించిన కూరగాయలను గ్రామంలోని వారసంత విక్రయిస్తున్నాం. మంచి మద్దతు ధర లభిస్తున్నది. రవాణా ఖర్చులు మిగులుతున్నాయి. ఎక్కడో దూరంలో ఉన్న పట్నం పోయి విక్రయించే శ్రమ, సమయం కలిసి వస్తున్నది. ఇబ్బందులు తప్పాయ్.
– జంగుబాబు, రైతు