ఆదిలాబాద్ రూరల్ : గ్రామాలు అభివృద్ధి చెందినపుడే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ముఖ్యమంత్రి కేసీఆర్ విశ్వసిస్తారని అందుకే ప్రభుత్వం పల్లెల అభివృద్ధిపై దృష్టి సారించిందని ఎమ్మెల్యే జోగురామన్న అన్నారు. శుక్రవారం మండలంలోని వాన్వట్లో నిర్మించిన పంచాయతీ భవనాన్ని ఆయన ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ పంచాయతీలకు గతంలో భిన్నంగా ప్రతి నెలా నిధులు విడుదల చేస్తూ పల్లె ప్రగతి పేరుతో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు.
గ్రామాల సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కొడప తూర్పాబాయి, మాధవ్, ఎంపీటీసీ మాడ సూరక్క, టీఆర్ఎస్ నాయకులు సెవ్వ జగదీశ్, కొడపసోనేరావ్, నైతం శుక్లాల్ తదితరులు పాల్గొన్నారు.