నిర్మల్ అర్బన్, పిబ్రవరి 3 : నిర్మల్లో రూ. 3.50 కోట్లతో నిర్మించిన రవాణా శాఖ కార్యాలయ భవనం సిద్ధమైంది. గత కొన్నేండ్లుగా చించోలి (బీ) వద్ద తాత్కాలిక షెడ్లో ఈ కార్యాలయ కార్యకలాపాలు కొనసాగుతున్నవి. కొత్త భవనంతో అధికారులు, సిబ్బంది, వాహనదారుల ఇబ్బందులు తొలగనుండగా, త్వరలోనే ఈ ఆర్టీఏ ఆఫీస్ను ప్రారంభిం చేందుకు అధికార యంత్రాంగం సిద్ధమవుతున్నది.
నిర్మల్ జిల్లా రవాణా శాఖ కార్యాలయానికి సొంత భవనం సిద్ధమైంది. కొన్నేండ్లుగా డాక్టర్స్ లేన్లో ఉన్న రవాణా శాఖ కార్యాలయం జిల్లా ఏర్పాటుతో నిర్మల్ పట్టణ శివారులోని చించోలి (బీ) వద్ద తాత్కాలిక షెడ్కు మారింది. ఈ క్రమంలో అనేక ఇబ్బందుల నడుమ కార్యాలయాన్ని కొనసాగించారు. కాగా, నూతనంగా నిర్మించిన కార్యాలయంలో అధికారులు, సిబ్బంది, వాహనదారులకు ఇబ్బందులు దూరం కానున్నాయి. నూతన సొంత కార్యాలయం సిద్ధం కావడంతో వాహన పరీక్షలు సైతం అధికారులు మరింత పకడ్బందీగా నిర్వహించేందుకు జిల్లా రవాణా శాఖ అధికారి ఏ అజయ్ కుమార్ రెడ్డి చర్యలు చేపట్టారు. ఫర్నిచర్, ఇతర సామగ్రి పూర్తి స్థాయిలో వస్తే త్వరలోనే నూతన కార్యాలయాన్ని ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
అధునాతన హంగులతో..
ఇది వరకు అరకొర సౌకర్యాలతో అద్దె భవనాల్లో, తాత్కాలిక షెడ్లో కొనసాగిన రవాణా శాఖ కార్యాలయానికి అధునాతన హంగులతో భవనం నిర్మించారు. రాష్ట్ర ప్రభుత్వం రూ.3.50 కోట్లు ఖర్చు చేసి భవిష్యత్లో పెరుగనున్న వాహనదారులను దృష్టిలో ఉంచుకొని కార్యాలయంలో అన్ని ఏర్పాట్లు చేశారు. జిల్లా రవాణా శాఖ అధికారి, మోటర్ వెహికిల్ ఇన్స్పెక్టర్ సహా వివిధ రకాల పనులు నిర్వహించేలా ప్రత్యేక గదులు ని ర్మించారు. కార్యాలయానికి డ్రైవింగ్ శిక్షణ, వాహ న పత్రాలు, వాహనాల ఫిట్నెస్ తదితర పనుల కోసం వచ్చే వారికి ఇబ్బందులు తలెత్తకుండా వెయిటింగ్ హాల్, తదితరవి సిద్ధం చేశారు.
ఐదెకరాల్లో కార్యాలయం, ట్రాక్ల నిర్మాణం
తమ వాహనాలతో డ్రైవింగ్ పరీక్షను నిర్వహించేందుకు ప్రత్యేక ట్రాక్లను నిర్మించారు. నాలుగు చక్రాల వాహనాలు, భారీ వాహనాల పరీక్షలకు సంబంధించి వేర్వేరుగా ఎస్, 8 ఆకారాల్లో ప్ర త్యేక ట్రాక్లు ఏర్పాటు చేశారు. వాహనదారుల డ్రైవింగ్ పరీక్షలను ఈ ట్రాక్లలో నిర్వహిస్తారు. ఇందులో సురక్షితంగా వాహనాన్ని నడపడం, పా ర్కింగ్ చేయడం, వెనుకకు, ముందుకు తిప్ప డం వంటివి వస్తేనే డ్రైవింగ్ పరీక్షల్లో ఉత్తీర్ణులైనట్లు. డ్రైవింగ్ పరీక్షల్లో ఉత్తీర్ణులైన వారికే జిల్లా రవాణా శాఖ అధికారి లైసెన్స్లు జారీ చేస్తారు. వాహనదారులు నేరుగా ట్రాక్లోకి వచ్చి డ్రైవింగ్ చేస్తే కొద్దిగా బెరుకుగా భయంగా ఉండనుండడంతో శిక్షణకు ముందుగా రిహాల్స్ కోసం అదనంగా ట్రాక్ను ని ర్మించేందుకు జిల్లా రవాణా శాఖ అధికారి అజయ్ కుమార్ చొరవ చూపుతున్నారు. గతంలో సొంత భవనం లేకపోవడం వివిధ కేసుల్లో పట్టుబడ్డ వా హనాలను జిల్లా రవాణా శాఖ కార్యాలయంలో భద్రపర్చాల్సి ఉండగా.. స్థలం కొరతతో బస్డిపో లో ఉంచేవారు. ఇక వాటిని జిల్లా రవాణా శాఖ కార్యాలయంలోనే ఉంచనున్నారు.
నూతన భనవంతో ఇబ్బందులు దూరం
గతంలో అద్దె భవనాలు, తాత్కాలిక భవనాల్లో కార్యాలయం నిర్వహించడంతో అధికారులు, సిబ్బంది, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రభుత్వం రూ.3.50 కోట్లతో అన్ని హంగులతో నూతన భవనం నిర్మించడంతో ఇబ్బందులు దూరమయ్యాయి. వాహనదారులకు అన్ని పరీక్షలు నిర్వహించేందుకు ట్రాక్లను నిర్మించాం. అందులో సమర్థవంతంగా వాహనాలు నడిపిన వారికే లైసెన్సులు జారీ చేస్తాం. డ్రైవింగ్ పరీక్షకు వచ్చే వారు తమ వాహనాలను నడిపేందుకు రిహార్సల్ కోసం అదనంగా ట్రాక్ నిర్మించేందుకు చర్యలు చేపడుతున్నాం. నూతన భవనాన్ని త్వరలో ప్రారంభించేలా చర్యలు తీసుకుంటున్నాం.
– ఏ అజయ్ కుమార్ రెడ్డి, జిల్లా రవాణా శాఖ అధికారి, నిర్మల్