చెన్నూర్, ఫిబ్రవరి 23 : పార్లమెంట్ ఎన్నికల్లో అధికారులు తమ విధులను పకడ్బందీగా నిర్వహించాలని చెన్నూర్ నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి సిడం దత్తు అన్నారు. చెన్నూర్లో ఎఫ్ఎస్టీ, ఎస్ఎస్టీ టీమ్లు, సెక్టోరల్ అధికారులతో శుక్రవారం సమీక్ష నిర్వహించారు.
ఆయా విభాగాల్లో నియమితులైన అధికారులు ఎన్నికలు విజయవంతంగా జరిగేలా కృషి చేయాలన్నారు. ఏవైనా సందేహాలుంటే తమను సంప్రదించాలని కోరారు. ఈ సమావేశంలో నియోజకవర్గంలోని మండలాల తహసీల్దార్లు మల్లికార్జున్, సదానందం, చంద్రశేఖర్, వనజారెడ్డి, మహేంద్రనాథ్, ఎన్నికల డిప్యూటీ తహసీల్దార్ లక్ష్మీనారాయణ, 63 మంది ఎన్నికల అధికారులు పాల్గొన్నారు.