దిలావర్పూర్, ఏప్రిల్ 18 : అవసరానికి ఆసరా పింఛన్ అండగా నిలుస్తున్నది. తెలంగాణ రాక ముందు రూ.200 ఉన్న పింఛన్ వారికి పెద్దగ ఆసరా అయ్యేది కాదు. అవి కూడా అప్పుడప్పుడు వచ్చి ఇచ్చేవారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుతో ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్వర్యంలోని సర్కారు వృద్ధాప్య, వితంతు, ఒంటరి మహిళ, బీడి పింఛన్లను ఆసరా పథకం పేరుతో రూ.2016, వికలాంగుల పింఛన్ రూ.3016 ఇచ్చి వారి జీవితాలల్లో వెలుగులు నింపి మేమున్నాం అంటూ ఆర్థిక భరోసా కల్పించింది తెలంగాణ ప్రభుత్వం. ఆసరా పింఛన్తో ఇంట్లో ఉన్న వృద్ధులకు గౌరవం దక్కింది. మండలంలోని 12 పంచాయతీల్లో వృద్ధాప్య పింఛన్లు 1143, వితంతు పింఛన్లు 1321, వికలాంగుల పింఛన్లు 309, ఒంటరి మహిళలు 138, బీడీ పింఛన్లు 3334 ఉన్నాయి. మొత్తంగా 6245 మంది ఆసరా పింఛన్ల ద్వారా లబ్ధి పొందుతున్నారు.
చిన్న చిట్టి ఏసుకున్న…
కేసీఆర్ సార్ ఆసరా పింఛన్ నా మందులు, అవసరాలకు పోను నా మనుమరాలు అడిగిన ప్పుడు రూ. ఐదు, పది రూపాయ లు ఇవ్వంగా నెలకు రూ.500 లతో చిన్న చిట్టి వేసుకున్న. నాకు చేతగానప్పుడు ఉపయోగ పడుతాయని దాచిపెట్టుకున్న. ఆరు నెలల నుంచి చేతకాక మందులకు పోను నా బిడ్డలు ఇంటికి వచ్చినప్పుడు వారి పిల్లల ఖర్చులకు సరిపోతు న్నాయి. ముందు నెలకు రెండు వందల పింఛన్ ఇస్తుండే. నాకు అప్పుడు రాలేదు. తెలంగాణ వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ ప్రభుత్వం పింఛన్ ఇస్తున్నది. నేను నా భార్య సంతోషంగా బతుకుతున్నాం.
– యార భూషణ్, మాయపూర్
భరోసా కల్పించిన సీఎం
నేను డిగ్రీ సెకండియర్ చదువుకుంటున్న. తెలంగాణ రాక ముందు నాకు పింఛన్ వచ్చేది కాదు. రాష్ట్రం ఏర్పడిన తరువాత నిర్మల్ లో నిర్వహించిన సదరం శిబిరంలో సర్టిఫికెట్ తీసుకున్నా, నాకు అప్పటి నుంచి ఆసరా పింఛన్ ప్రతీ నెల రూ.3016 వస్తున్నాయి. నాయకు చాలా సంతోషంగా ఉంది. దివ్యాంగులకు సీఎం కేసీఆర్ సార్ భరోసా ఇచ్చాడు. ప్రతి నెల నా అవసరాలకు పోనూ మిగిలిన డబ్బులను నా ఉన్నత చదువుల కోసం ఉపయోగ పడుతాయని జమ చేసుకుంటున్న. ఉన్నత చదువు చదివి ఉద్యోగం సాధిస్తా. మా అమ్మ నాన్నకు తోడుగా ఉంటాను.
– టీ దీపిక, న్యూ లోలం