నిర్మల్, ఫిబ్రవరి 19(నమస్తే తెలంగాణ):రాష్ట్రంలోని సబ్బం డ వర్గాలకు ప్రయోజనం చేకూరేలా రాష్ట్ర ప్రభుత్వం అభివృ ద్ధ్ది, సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నది. ముఖ్యంగా ఆ సరా పింఛన్లు అభాగ్యుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నా యి. వృద్ధాప్యంతో పాటు ఇతర కారణాలతో బాధపడుతున్న వారికి భరోసానిస్తున్నాయి. 2014లో ఆసరా పింఛన్ పథకా న్ని ప్రభుత్వం తీసుకొచ్చింది. దీని ద్వారా వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు, కల్లుగీత, చేనేత, బీడీ కార్మికులు, హెచ్ఐవీ, పైలేరియా వ్యాధిగ్రస్తులు, డయాలసిస్ రోగులకు ప్రతినెలా పింఛన్ను అందిస్తూ ఆదుకుంటున్నది. అయితే గతంలో ఉన్న ‘ఆసరా’ నిబంధనలను ఇటీవ ల రాష్ట్ర ప్రభుత్వం సడలించింది. భర్త మరణించిన జీవిత భాగస్వామికి 57 ఏండ్లు నిండితే వృద్ధాప్య పింఛన్… 57 కంటే తక్కువ వయస్సు ఉన్న వారికి వితంతు పింఛన్ను ఇ కపై దరఖాస్తు చేసుకున్న 15 రోజుల్లోనే మంజూరు చేయనున్నది.
అలాంటి వారిని ప్రతినెలా గుర్తించాలని ప్రభుత్వం ఉ త్తర్వులు వెలువరించింది. దీంతో అధికారులు అర్హులను గు ర్తించే పనిలో నిమగ్నమయ్యారు. భార్య ఆధార్కార్డుతో పాటు భర్త మరణ ధ్రువీకరణ పత్రాన్ని జత చేసి దరఖాస్తు చేసుకు న్న 15 రోజుల్లోనే పింఛన్ అందేలా అధికారులు చర్యలు తీ సుకుంటున్నారు. గతేడాది ఆగస్టు నెలలో అన్ని విభాగాల్లో అర్హులను గుర్తించిన ప్రభుత్వం కొత్త పింఛన్లను మంజూరు చేసిన సంగతి తెలిసిందే. కాగా పింఛన్దారులు తమ ఆధార్ నెంబరును ఈకేవైసీకి అనుసంధానం చేయించాలని అధికారులు సూచిస్తున్నారు. పింఛన్ పొందుతున్న భర్త మరణిస్తే ఆయన స్థానంలో భార్యకు ఆసరా కింద వృద్ధాప్య, వితంతు పింఛన్ను వెంటనే మంజూరు చేయాలని ప్రభుత్వం ఇటీవల ప్రత్యేకంగా ఉత్తర్వులను జారీ చేసింది. ఈ మేరకు ‘ఆసరా’ నిబంధనలు మార్చడంతో మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నా రు. జిల్లా వ్యాప్తంగా దివ్యాంగులకు రూ.3,016, ఇతర లబ్ధిదారులకు రూ. 2,016 చొప్పున లక్షలాది కుటుంబాలకు స హాయం అందుతున్నది.
దరఖాస్తు ఇలా..
పింఛన్ పొందుతున్న వ్యక్తి మృతి చెందితే అతడి భార్య తన ఆధార్ కార్డుతో పాటు భర్త మరణ ధ్రువీకరణ పత్రాన్ని దరఖాస్తు ఫారానికి జత చేసి గ్రామాల్లో ఉండే పంచాయతీ కార్యదర్శులకు అందజేయాలి. అదే పట్టణాల్లో అయితే మున్సిపల్ కార్యాలయంలోని సంబంధిత సెక్షన్లో ఇవ్వాల్సి ఉంటుంది. దరఖాస్తులను పరిశీలించిన సంబంధిత అధికారులు వాటిని ఆన్లైన్ ద్వారా ఉన్నతాధికారులకు పంపిస్తారు. ఈ ప్రక్రియ అంతా 15రోజుల్లోనే పూర్తి చేయాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఉన్నతాధికారులు దరఖాస్తులను పరిశీలించి పింఛన్లను మంజూరు చేస్తారు. ప్రతినెలా ఇలాంటి లబ్ధిదారులను గుర్తించి ఆసరా వెబ్సైట్లో వారి వివరాలను అప్లోడ్ చేయాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది.
జిల్లాలో 1,51,362 మంది లబ్ధిదారులు..
నిర్మల్ జిల్లాలోని 1,51,362మంది లబ్ధిదారులకు ప్రభు త్వం ప్రతినెలా రూ. 31కోట్ల 58లక్షలను ఆసరా పింఛన్లను పంపిణీ చేస్తున్నది. వారిలో వృద్ధాప్య పింఛన్లు 37,666మందికి, వితంతు పింఛన్లు 37,781మంది, దివ్యాంగ పింఛన్లు 10,650 మందికి అందుతున్నాయి. అలాగే గీత కార్మికులు 293 మందికి, చేనేత కార్మికులు 53 మందికి, ఫైలేరియా వ్యాధిగ్రస్తులు 232మంది, డయాలసిస్ రోగులు 58మంది, ఒంటరి మహిళలు 2148 మంది, బీడీ కార్మికులు 62,481 మందికి పింఛన్లు అందుతున్నాయి.
నిబంధనలు సడలించింది..
ఇంటి పెద్దను కోల్పోయిన కుటుంబం ఇబ్బందులకు గురి కావొద్దనే ఉద్దేశంతో ప్రభుత్వం అతడి భాగస్వామికి వెంటనే పింఛన్ అందించాలని నిర్ణయించింది. ఇందుకోసం ఆసరా పథకంలోని నిబంధనలను సడలించింది. అవసరమైన దృవ పత్రాలను జత చేసి దరఖాస్తు ఫారాన్ని అధికారులకు అందజేస్తే… వారికి 15 రోజుల్లోగా పింఛన్ అందేలా చూస్తాం. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను ప్రభుత్వం ఇటీవలే విడుదల చేసింది. అన్ని వర్గాల ప్రజలను ఆదుకోవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం నిబంధనలను మార్చింది.
–విజయలక్ష్మి, డీఆర్డీవో నిర్మల్