కుమ్రం భీం ఆసిఫాబాద్, డిసెంబర్ 29 (నమస్తే తెలంగాణ): జిల్లాలో ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ రెండో రోజూ కొనసాగింది. రెబ్బెన మండలం కైర్గాం కేంద్రాన్ని కలెక్టర్ బోర్కడే హేమంత్ సహదేవ్రావు పరిశీలించారు. అర్జీదారులకు ఎలాంటి ఇబ్బందుల్లేకుండా చూడాలని అధికారులకు సూచించారు.
దరఖాస్తుల సమర్పణలో తలెత్తుతున్న ఇబ్బందుల గురించి తెలుసుకున్నారు. జిల్లాలో అర్హులైన ప్రతి ఒక్కరూ అర్జీలు పెట్టుకోవాలని సూచించారు. ప్రజా పాలన కార్యక్రమం మొదటి రోజు కొన్ని గ్రామాల్లో ఆలస్యంగా ప్రారంభం కాగా, రెండో రోజు ఉదయం నుంచే అర్జీలు స్వీకరించారు.