మంచిర్యాల, ఏప్రిల్ 12(నమస్తే తెలంగాణ ప్రతినిధి): మంచిర్యాల జిల్లాలో రేషన్ దందా రోజురోజుకూ పెరిగిపోతున్నది. నేరుగా రేషన్ షాపు నిర్వాహకులే అక్రమార్కులకు బియ్యా న్ని అప్పగిస్తున్నారనడానికి ఈ ఘటనే సజీవ సాక్ష్యంగా నిలుస్తున్నది. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని చింతపండువాడకు చెందిన రేష న్ దుకాణం నంబర్-3211018 నుంచి రాత్రి వేళ ఆటోలో రేషన్ బియ్యాన్ని తరలించుకుపోతున్న వీడియో శుక్రవారం వాట్సప్ గ్రూపుల్లో వైరల్ అయ్యింది.
రేషన్ షాపు నుం చి బియ్యం తెచ్చి ఆటోలో వేస్తున్న దృశ్యాలు రికార్డు అయ్యాయి. కాగా, ఈ వీడియో తీసిన స్థానిక యువకులతో మంచిర్యాల మున్సిపాలిటీ 23వ వార్డు కౌన్సిలర్ రామగిరి బానేశ్ కుటుంబ సభ్యులు గొడవకు దిగారు. ఇరువర్గాల మధ్య మాటామాట పెరిగి పెద్ద గొడవకు దారితీసింది. ఈ విషయమై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఇరువర్గాలకు నచ్చజెప్పి పంపించేశారు.
ఇదే కౌన్సిలర్ బానేశ్ ఇంటి పనుల కోసం మంచిర్యాల మున్సిపల్ సిబ్బందిని వాడుకుంటున్నట్లు స్థానికులు చెబుతున్నారు. మున్సిపాలిటీ నుంచి జీతం తీసుకునే సిబ్బందిని కౌన్సిలర్ సొంత పనులకు వాడుకోవడంపై ఆగ్ర హం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు మున్సిపల్ సిబ్బంది ఒకరు కౌన్సిలర్ బానేశ్ కారు తుడుస్తున్న వీడియో సైతం బయటికి వచ్చింది.
ఈ రెండు విషయాలపై సదరు కౌన్సిలర్ను వివరణ కోరగా.. రేషన్ షాపునకు తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. నడుమునొప్పి కారణంగా మున్సిపల్ సిబ్బందిని ఇంట్లో వాటర్ క్యాన్ మోసేందుకు వాడుకున్నానన్నారు. అర్జెంట్గా ఓ ఫంక్షన్కు వెళ్లే హడావుడిలో ఒకసారి కారును కూడా తుడిపించినట్లు చెప్పారు. తనపై కావాలనే కొంద రు స్థానికులు దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన తెలిపారు.