ఎదులాపురం, ఫిబ్రవరి 22 : ప్రభుత్వం అందించే రేషన్ బియ్యంలో బయట దొరికే బియ్యం కంటే అదిక పోషకాలు ఉంటాయని, రేషన్ బియ్యం వినియోగం పెంచేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్రపుడ్ కమిషన్ చైర్మన్ కే తిరుమల్ రెడ్డి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో బుధవారం వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆహార భద్రత చట్టం ప్రకారం పౌష్టికాహారం పొందడం ప్రతి ఒక్కరి హక్కు అని, అదే విధంగా అందించడం కూడా అధికారులు బాధ్యత అని తెలిపారు. పోషకాహారం అందించే విషయంలో నిర్లక్ష్యంగా వ్వవహరించే వారిపై కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు.
క్షేత్రస్థాయిలో మండల స్థాయి అధికారులు వారి పరిధిలోని చౌకధరల దుకాణాలు, వసతి గృహాలను తనిఖీ చేసి నివేదికను సమర్పించాల న్నారు. ఫుడ్ ఇన్స్పెక్టర్ వసతి గృహాలను,రేషన్ షాపులు, మధ్యాహ్న భోజనం తదితర నిత్యా వసర వస్తువులను తనిఖీ చేసి భోజనాలను రుచి చూసి నివేదికను అందించాలన్నారు. గుడి హ త్నూర్ మండలం మన్నూర్లోని అంగన్వాడీ కేంద్రాలకు సరుకులు సక్రమంగా సరఫరా చేయడం లేదని, తనిఖీ సందర్భంగా గుర్తిం చామని, ఇలాంటి పొరపాట్లు జరుగకుండా ఐసీడీ ఎస్, జిల్లా అధికారులు, విజిలెన్స్ కమిటీలు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్, జడ్పీటీసీలు తాటిపెల్లిరాజు, సుధాకర్, అదనపు కలెక్టర్ నటరాజ్, రిజ్వాన్ బాషా షేక్, ట్రైనీ అసిస్టెంట్ కలెక్టర్ శ్రీజ, వివిధ శాఖల అధికారులు, తహసీల్దార్లు పాల్గొన్నారు.