ఇంద్రవెల్లి, ఏప్రిల్ 16 : ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని ముత్నూర్ గ్రామానికి చెందిన రేకుల్వార్ శుభం యుపీఎస్సీ సివిల్ ఫలితాల్లో ఆలిండియా స్థాయిలో 790 ర్యాంకు సాధించాడు. మాజీ రిపోర్టర్ సత్యనారాణయగౌడ్-గీత దంపతులకు ముగ్గురు కుమారులు. పెద్ద కొడుకు నీలేశ్ మీ సేవా కేంద్రాన్ని నడిపిస్తున్నాడు. రెండో కుమారుడు బాంబేలోని పంజాబ్ నేషనల్ బ్యాంకులో మేనేజర్గా విధులు నిర్వహిస్తున్నాడు. మూడో కు మారుడు రేకుల్వార్ శుభం మండల కేంద్రంలోని ప్రతిభ ప్రైవేట్ పాఠశాలలో 1వ తగరతి నుంచి 5వ తరగతి వరకు చదువుకున్నాడు. కాగజ్నగర్లోని నవోదయ విద్యాలయంలో 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదువుకున్నాడు. హైదరాబాద్లోని నారాయణ కళాశాలలో ఇంటర్మీడియట్ పూర్తి చేశాడు. అస్సాంలోని గోవాటిలోని ఐఐటీలో బీటేక్లో నాలుగు సంవత్సరాలు చదువుకున్నాడు. అనంతరం ఉద్యోగం చేస్తూనే ఢిల్లీలోని విజన్ ఐఏఎస్ అకాడమీలో రెండేండ్ల శిక్షణ తీసుకున్నాడు. యూపీఎస్సీ సివిల్ పోటీ పరీక్షలు నాలుగు సార్లు రాశాడు. 2024లో వెలువడిన ఫలితాల్లో 790వ ర్యాంకు సాధించి సివిల్ సర్వీస్కు ఎంపికయ్యాడు. ఐఏఎస్, ఐఆర్ఎస్, ఐఎఫ్ఎస్ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపాడు. దీంతో కుటుంబీకులతోపాటు ముత్నూర్ గ్రామస్తులు, మండల ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నాడు.