రెబ్బెన, ఏప్రిల్ 28 : తక్కలపల్లి సమీపంలోని ఎకోబ్రిడ్జి(అండర్పాస్), తక్కలపల్లి ధర్మారం ప్లాంటేషన్లను అమ్రాబాద్ టైగర్ రిజర్వు ఎఫ్డీపీటీ క్షితిజ ఆదివారం పరిశీలించారు.
కవ్వాల్ టైగర్ రిజర్వు ఎఫ్డీపీటీ శాంతారాం, డీఎఫ్వో నీరజ్కుమార్, రెబ్బెన రేంజ్ ఇన్చార్జి అధికారి శ్రీధరాచారి ఆమెకు పుష్పగుచ్ఛం ఇచ్చి స్వాగతం పలికారు. అనంతరం ఎకోబ్రిడ్జి నిర్మాణం, ఉపయోగాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో సెక్షన్ ఆఫీసర్ సతీశ్, బీట్ అధికారులు భూక్య రవి, మమత ఉన్నారు.