మామడ, సెప్టెంబర్ : పోడు భూముల సర్వేను వేగవంతం చేయాలని నిర్మల్ కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ పేర్కొన్నారు. మండలంలోని దిమ్మదుర్తి గ్రామంలో పోడు భూముల సర్వేను శుక్రవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. అధికారులు స మన్వయంతో పనిచేయాలని పేర్కొన్నారు. సర్వే కు ముందు రోజు సంబంధిత రైతులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు. ఇప్పటి వరకు చేసిన సర్వే సమాచారం అధికారులను అడిగి తెలుసుకున్నారు. దరఖాస్తు చేసిన రైతులతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కడే, ఎఫ్ఆర్వో పుండలిక్, ఎంపీడీవో మల్లేశం, తహసీల్దార్ కిరణ్మయి, ఎంపీవో గోవర్ధన్, పంచాయతీ కార్యదర్శి అశ్విత, అటవీశాఖ సిబ్బంది, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
మస్కాపూర్ ప్రభుత్వ పాఠశాల సందర్శన
ఖానాపూర్ రూరల్, సెప్టెంబర్ 30 : మండలంలోని మస్కాపూర్ గ్రామంలో ‘మన ఊరు మన బడి’లో ఎంపికైన ప్రభుత్వ సెకండరీ పాఠశాలను అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కడేతో కలిసి కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ సందర్శించారు. ప్రభుత్వ, స్థానిక సంస్థల పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు నాణ్యమైన విద్య, మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నదని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో వనజ, తహసీల్దార్ రాజమోహన్, ఎంపీవో చంద్రశేఖర్, కార్యదర్శి కల్పన, నాయకులు మహేందర్, పుప్పాల స్వప్న, గజేందర్, ఎంఈవో మధుసూదన్, సిబ్బంది వివేకానంద కుమార్, బాలాజీ, జాడి శ్రీనివాస్ పాల్గొన్నారు.
కడెం మండలం లింగాపూర్ పాఠశాల..
కడెం, సెప్టెంబర్ 30: మండలంలోని లింగాపూర్ గ్రామాన్ని కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ సందర్శించారు. ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమం ద్వారా చేపడుతున్న పనులను పరిశీలించారు. అనంతరం అధికారులతో మాట్లాడారు. పనులు నాణ్యతగా, త్వరగా పూర్తి చేసేలా చర్య లు తీసుకోవాలని ఆదేశించారు. విద్యార్థుల కోసం తప్పనిసరిగా ప్లే గ్రౌండ్ ఏర్పాటు చేయాలని సూచించారు. అనంతరం పాఠశాల సిబ్బందితో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కడే, ఆర్డీవో తుకారాం, తహసీల్దార్ గజానన్, ఎంఈవో మధుసూదన్, ఎంపీడీవో లింబాద్రి, సర్పంచ్ ఆకుల బాలవ్వ, జడ్పీటీసీ పురపాటి శ్రీనివాస్రెడ్డి, ఆయా గ్రా మాల సర్పంచులు, స్థానిక నాయకులు, తదితరులు పాల్గొన్నారు.