దండేపల్లి, ఏప్రిల్ 10 : ముస్లింలకు అత్యంత ప్రీతిపాత్రమైనది రంజాన్ మాసం. ముస్లింలు 30 రోజులుగా చేస్తున్న ఉపవాస దీక్షలు బుధవారంతో ముగిశాయి. రంజాన్ మాసం బుధవారం ముగియగా, షవ్వాల్ మాసంలోని మొద టి రోజున జరుపుకునే పండుగ ఈద్-ఉల్-ఫితర్. బుధవారం సాయంత్రం ఆకాశంలో నెలవంక కనిపించడంతో గురువారం పండుగ జరుపుకోవాలని మత గురువులు ప్రకటించారు.
యేటా పండుగ సందర్భంగా ఈద్గాల వద్ద ప్రత్యేక ప్రార్థనల కోసం ఏర్పాట్లు చేశారు. సామూహిక ప్రార్థనలకు ముస్లింలు సమాయత్తం అవుతున్నారు. ఈద్గాల వద్ద చెత్తాచెదారం తొలిగించి, రంగులు వేసి, షామియానాలు వేస్తున్నారు.