నిర్మల్ టౌన్, జనవరి 20 : వ్యక్తిగత పరిశుభ్రతపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని, పరిసరాలను శుభ్రంగా ఉంచేలా కృషి చేయాలని నిర్మల్ కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ అన్నారు. యునిసెఫ్ ఆధ్వర్యంలో మెప్మాలో పని చేస్తున్న రిసోర్స్పర్సన్లకు ఆరోగ్య కిట్లను కలెక్టరేట్లో గురువారం అందించారు. మొత్తం 15 మంది సిబ్బందికి వీటిని అందించారు. రిసోర్స్పర్సన్లు ఈ కిట్లను వినియోగించుకొని అన్ని ప్రాంతాల్లో సర్వే నిర్వహించాలని సూచించారు. అదనపు కలెక్టర్ హేమంత్ బొర్కడే, మున్సి పల్ కమిషనర్ సత్యనారాయణ, మెప్మా పీడీ సుభాష్, సిబ్బంది సావిత్రి, ప్రమోద్, పాల్గొన్నారు.
ప్రచార రథం ప్రారంభం
పరిసరాల పరిశుభ్రతపై జిల్లాలో ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రచార రథాన్ని కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ గురువారం ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ నిర్మల్ జిల్లాలో ప్రజలకు వివిధ వ్యాధుల నివారణపై విస్తృతంగా అవగాహన కల్పించేందుకు ఈ ప్రచార రథం ఉపయోగపడుతుందని తెలిపారు. కొవిడ్ నివారణపై ప్రజల్లో అవగాహన కల్పించి, వైరస్ కట్టడికి కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి ధన్రాజ్, డీపీఆర్వో ఉమారాణి, రక్షక్ మొబైల్ నిర్వాహకులు బ్రహ్మానందం, సిబ్బంది పాల్గొన్నారు. అంతకుముందు కరపత్రాలను విడుదల చేశారు.
డంప్ యార్డు తనిఖీ
నిర్మల్ పట్టణంలోని బంగల్పేట్ శివారులో గల డంప్ యార్డును కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ తనిఖీ చేశారు. తడి, పొడి చెత్త వేరు చేస్తున్న విధానాన్ని అడిగి తెలుసుకున్నారు. పట్టణంలో సేకరించిన చెత్తను డంప్ యార్డులకు తరలించాలని సూచించారు. అనంతరం శ్మశానవాటికల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కడే, మున్సిపల్ఛైర్మన్ సత్యనారాయణరెడ్డి, మున్సిపల్శాఖఅధికారులు అజర్, తదితరులు పాల్గొన్నారు.