ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా ముసురేసింది. మంగళవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు వర్షం కురియడంతో జిల్లాలో సగటు వర్షపాతం 7.3 మిల్లీ మీటర్లుగా నమోదైంది. ఈ ఏడాది వానకాలం ప్రారంభమైనప్పటి నుంచి మోస్తరు వర్షం పడుతున్నది.
ఈ వాన పత్తి, కంది, సోయా పంటలకు మేలు చేస్తుందని.. చెరువులు, బావులు, ప్రాజెక్టుల్లోకి నీరు చేరుతోందని అధికారులు పేర్కొంటున్నారు. లోతట్టు ప్రాంతాల్లోని చేలకు వర్షపు నీరు చేరింది. చల్లటి గాలుల కారణంగా ప్రజలు ఇబ్బండిపడ్డారు. బుధ, గురువారాల్లో కూడా వర్షం పడే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.