భైంసా, మార్చి, 17 : భైంసాలో శుక్రవారం ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ బలగాలు ఫ్ల్లాగ్మార్చ్ నిర్వహించారు. పట్టణ పోలీస్ స్టేషన్ నుంచి పంజేషా చౌక్, భట్టిగల్ల్లీ, తదితర ఏరియాల మీదు గా కవాతు కొనసాగింది. పట్టణ సీఐ ఎశ్రీనివాస్, ఎస్ఐ శ్రీనివాస్, ఆర్ఏఎఫ్ కమాండెంట్ విజయ కుమార్ వర్మ, డిప్యూటీ కమాండెంట్ శ్రీకాంత్, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
కుభీర్లో..
కుభీర్, మార్చి 17 : మండల కేంద్రంలో శుక్ర వారం స్థానిక పోలీసులు, ఆయా పోలీస్ స్టేషన్ల ఎస్ఐలు, ఆర్పీఎఫ్ (ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్), బలగాలు వీధుల గుండా కవాతు నిర్వహించా యి. ముందుగా పోలీస్స్టేషన్ నుంచి బయలు దేరిన కవాతు బజార్ గల్లీ, పాత బస్టాండ్, భట్టిగల్లీ అంగడి బజార్ నుంచి తిరిగి పోలీస్ స్టేషన్ చేరుకుంది. ఈ నెలలో ఉగాది, శ్రీరామ నవమి పండుగల నేపథ్యంలో శాంతి భద్రతల పరిరక్షణకు ఈ కవాతు దోహదం చేస్తుందని డిప్యూటీ కమాండెంట్ వీ శ్రీకాంత్ తెలిపారు. అంతకు ముందు పోలీస్స్టేషన్లో భైంసా రూరల్ సీఐ చంద్రశేఖర్ మాట్లాడారు. శాంతిభద్రతల పరిరక్షణే తమ ధ్యేయమన్నారు. కుభీర్ ఎస్ఐ ఎండీ షరీఫ్ ఉన్నారు.