ప్రజలకు ప్రజాప్రతినిధులు, అధికారుల పిలుపు
గ్రామాల్లో ముమ్మరంగా పల్లె ప్రగతి
పనుల పరిశీలన.. సమస్యలపై ఆరా
గ్రామాల్లో చేపట్టే అభివృద్ధి పనుల్లో ప్రజలు భాగస్వాములు కావాలని అధికారులు, ప్రజాప్రతినిధులు పిలుపునిచ్చారు. పల్లెప్రగతిలో భాగంగా ఆదివారం చేపట్టిన పనులను వారు పరిశీలించారు. ప్రజలను కలిసి సమస్యలపై ఆరాతీశారు. పరిష్కారానికి సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
నేరడిగొండ, జూన్ 5 : పల్లె ప్రగతిలో భాగంగా చేపట్టిన అభివృద్ధి పనుల్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని డీఆర్డీవో కిషన్ పిలుపునిచ్చారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఐదో విడుత పల్లె ప్రగతిలో భాగంగా మండలంలోని వడూర్ గ్రామంలో పనులను ఆదివారం పరిశీలించారు. నాలుగో విడుతలో చేపట్టిన పల్లె ప్రగతిలో మిగిలి ఉన్న పనులు వెంటనే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అభివృద్ధిపై నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. అనంతరం గ్రామంలో ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి ర్యాలీ తీశారు. గ్రామంలోని రైతు వేదికలో గ్రామస్తులకు పల్లె ప్రగతి పనులపై అవగాహన కల్పించారు. ఎంపీపీ రాథోడ్ సజన్, సర్పంచ్ గాదె సమత, ఎంపీటీసీ అంబేకర్ పండరి, ఎంపీడీవో అబ్దుల్ సమద్, ఏపీవో వసంత్రావ్, వీడీసీ చైర్మన్ చంద్రశేఖర్, నాయకులు గాదె శంకర్, గ్రామస్తులు, సిబ్బంది పాల్గొన్నారు.
జైనథ్ : అకోలిలో బురదగుంటలో బ్లీచింగ్ చల్లిస్తున్న ఎంపీపీ గోవర్ధన్
పరిసరాల శుభ్రత పాటించాలి
బోథ్, జూన్ 5 : పరిసరాల శుభ్రత పాటిస్తే రోగాలు దరి చేరవని బోథ్ ఎంపీపీ తుల శ్రీనివాస్, ఎంపీడీవో దుర్గం రాజేశ్వర్ సూచించారు. పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా మండలంలోని సొనాల గ్రామంలో ఇంటింటికీ తిరిగి అవగాహన కల్పించారు. పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవడంతో పాటు ప్లాస్టిక్ వాడకాన్ని నిర్మూలించాలని సూచించారు. తాగునీటి ట్యాంకును పరిశీలించి నీటి సరఫరా విషయమై కాలనీ వాసులతో మాట్లాడారు. సర్పంచ్ సదానందం, ఎంపీవో జీవన్రెడ్డి, ఏపీవో జగ్దేరావు పాల్గొన్నారు. బోథ్లో సర్పంచ్ సురేందర్యాదవ్, పంచాయతీ పాలకవర్గ సభ్యులు మటన్, చికెన్ దుకాణాలు తిరిగారు. వ్యర్థాలు ఎక్కడపడితే అక్కడ వేయవద్దని సూచించారు. భూమేశ్, జీపీ కార్యదర్శి అంజయ్య, సీసీ సంజీవ్, జీ నందయ్య, దేవన్న పాల్గొన్నారు.
జైనథ్ మండలంలో..
జైనథ్, జూన్ 5 : మండలంలోని ఆకోలిలో పల్లెప్రగతి కార్యక్రమంలో ఎంపీపీ మార్శెట్టి గోవర్ధన్ పాల్గొన్నారు. రక్షిత మంచినీటి ట్యాంకుల్లో, తాగునీటి బావుల్లో క్లోరినేషన్ చేయించారు. ముఖ్యంగా గ్రామంలో పాఠశాల యాజమాన్య కమిటీలు, అంగన్వాడీ కమిటీలు ఎప్పటి కప్పుడు సమావేశమై ప్రజలకు అవసరమైన పనులు చేపట్టాలని సూచించారు. ఎంపీవో వెంకటరాజు, సర్పంచ్ కేశవ్, ఎంపీటీసీ భోజన్న, నాయకులు మహేశ్, రూపేశ్, గ్రామస్తులు పాల్గొన్నారు.
ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి
బేల, జూన్ 5 : భావితరాల భవిష్యత్ కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని ఎంపీపీ వనిత ఠాక్రె అన్నారు. దహిగాం గ్రా మంలో పల్లె ప్రగతి కార్యక్రమంతో పాటు ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని నిర్వహించారు. గ్రామంలో రోడ్డుపై చెత్తాచెదారం తొలగించారు. పర్యావరణంపై ఇంటింటికీ తిరుగుతూ అవగాహ న కల్పించారు. గ్రామస్తులతో కలిసి మొక్క నాటారు. ప్రకృతి వైపరీత్యాలను నివారించడానికి ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని పేర్కొన్నారు. గ్రామాల్లో కొనసాగుతున్న పల్లె ప్రగతి కార్యక్రమం లో సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామన్నారు. మన గ్రామంలోని పిల్లలు ఇక్కడే సర్కారు స్కూళ్లల్లో చదువుకునేలా గ్రామస్తులే చర్యలు తీసుకోవాలన్నారు. టీఆర్ఎస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు గంభీర్ ఠాక్రె, సర్పంచ్ వారడే అంబుతాయి, గూడ సర్పంచ్ ఠాక్రె బేబితాయి, నాయకులు విఠల్ వారాడే, తానబా ఠాక్రె, ఎంపీడీవో భగత్ రవీందర్, పంచాయతీ కార్యదర్శి పాల్గొన్నారు.
ఉత్సాహంగా పల్లె ప్రగతి
భీంపూర్, జూన్ 5 : మండలంలోని 26 పంచాయతీల్లో పల్లెప్రగతి కింద వివిధ కార్యక్రమాలు చేపట్టారు. భీంపూర్ పంచాయతీలో భగీరథ నీటి ట్యాంకులను శుభ్రం చేశారు. వాడల్లో తిరిగి పరిశుభ్రత గురించి అవగాహన కల్పించారు. కరంజి(టీ)లో పల్లెప్రకృతి వనం, బృహత్ ప్రకృతి వనాల్లో కలుపు తీశారు. అందర్బంద్, నిపాని, కామట్వాడ, అర్లి, అంతర్గాంలో శుభ్రతపై అవగాహన కల్పించారు. సర్పంచులు మడావి లింబాజీ, పెండెపు కృష్ణయాదవ్, భూమన్న, తాటిపెల్లి లావణ్య, జీ స్వాతిక, బక్కి లలిత, గొల్లి రమాబాయి, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు మార్సెట్టి అనిల్, కార్యదర్శులు సాయినందన, నితిన్, నాయకులు జీ నరేందర్ యాదవ్, జీ వైభవ్ యాదవ్, బీ కపిల్యాదవ్, జాదవ్ రవీందర్, ఉత్తం రాథోడ్, ఆకటి నరేందర్రెడ్డి పాల్గొన్నారు.
అందరూ సహకరించాలి
సిరికొండ, జూన్ 5 : ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలందరూ అభివృద్ధికి సహకరించాలని మండల ప్రత్యేకాధికారి విజయ్ కుమార్ అన్నారు. మండలంలోని రాయిగూడ, కొండాపూర్, సిరికొండ, ధర్మసాగర్ గ్రామాల్లో ఆయన పర్యటించారు. పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఆయా జీపీల సర్పంచులు, ధర్మసాగర్ కార్యదర్శి జైపాల్, గ్రామపెద్ద దినేశ్ పాల్గొన్నారు.
తలమడుగు మండలంలో..
తలమడుగు, జూన్ 5 : మండలంలోని 28 గ్రామ పంచాయతీల్లో పల్లె ప్రగతి పనులు కొనసాగుతున్నాయి. ఖోడద్, సుంకిడి, కుచులాపూర్, సాయిలింగి గ్రామాల్లో పనులను ఎంపీడీవో రమాకాంత్ పరీశీలించారు. పల్లె ప్రగతి పనులను పకడ్బందీగా నిర్వహించాలని పేర్కొన్నారు. ఎంపీవో దిలీప్, సర్పంచులు, పంచాయతీ సెక్రటరీలు పాల్గొన్నారు.
ఇంద్రవెల్లి మండలంలో..
ఇంద్రవెల్లి, జూన్5 : మండలంలోని ఇంద్రవెల్లి, ఏమాయికుంట గ్రామ పంచాయతీల పరిధిలో చేపడుతున్న పారిశుధ్య పనులను డీఎల్పీవో భిక్షపతిగౌడ్ పరిశీలించారు. పల్లె ప్రగతిలో కేటాయించిన రోజువారీ కార్యక్రమాలను తప్పకుండా చేయాలన్నారు. రోడ్లకు ఇరువైపులా చెత్తతోపాటు ప్లాస్టిక్ను తొలగించాలని సూచించారు. ప్రతి గ్రామంలో పారిశుధ్య పనులు చేసి శుభ్రతను పాటించాలన్నారు. ఎంపీవో సంతోష్, ఇంద్రవెల్లి ఈవో సంజీవరావ్ పాల్గొన్నారు.
నార్నూర్ మండలంలో..
నార్నూర్,జూన్ 5 : మండల కేంద్రంలో ట్రాక్టర్ ద్వారా పిచ్చిమొక్కలు తొలగించారు. పారిశుధ్య పనులను సర్పంచ్ బానోత్ గజానంద్నాయక్ పరిశీలించారు. పంచాయతీ పరిధిలో అపరిశుభ్రత లోపించిన ప్రదేశాల్లో పిచ్చి మొక్కల తొలగింపు, మురుగు కాలువల శుభ్రత, తాగునీటి పథకాల వద్ద క్లోరినేషన్ చేశామని తెలిపారు. ఈయన వెంట నాయకులున్నారు.