కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రజాపాలన కార్యక్రమం ప్రజలకు కొత్త కష్టాలను తెచ్చిపెడుతున్నది. ఆరు గ్యారెంటీలకు దరఖాస్తు చేసుకునేవారు ఆధార్కార్డులో మార్పు చేర్పుల కోసం మీ సేవ కేంద్రాలకు పరుగులు పెడుతున్నారు. పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం పక్కనున్న మీ సేవ కార్యాలయానికి గ్రామీణులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు.
మీ సేవ కార్యాలయాలు పది గంటలకు తెరుస్తుండగా.. ప్రజలు ఉదయం ఏడింటి నుంచే క్యూ కడుతున్నారు. చంటి పిల్లల తల్లులు సైతం తరలివచ్చి నానా అవస్థలు పడుతున్నారు. గురువారం ఉదయం ‘నమస్తే తెలంగాణ’ అక్కడికి వెళ్లి చూడగా పెద్ద క్యూ కనిపించింది.
– బెల్లంపల్లి, డిసెంబర్ 29