ఇంద్రవెల్లి : . రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతంలో విద్యా అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుందని . ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్ తరహలో ప్రభుత్వం విద్యను అందిస్తుందని జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ అన్నారు. మండలంలోని ధనోరా(బి)గ్రామంలోని జిల్లా పరిషత్ పాఠశాలకు మంజూరైన రూ. 5లక్షలతో అదనపు గదుల నిర్మాణానికి శుక్రవారం భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలను చదివించాలని సూచించారు. తెలంగాణ ప్రభుత్వం నిరుపేదల ప్రభుత్వంగా గుర్తింపు పొందిందని, దేశంలో ఎక్కడా లేనివిధంగా ప్రజల కోసం సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని అన్నారు.
నాణ్యతతో గదులు నిర్మించి విద్యాభివృద్ధికి కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ ఆర్కా పుష్పలత, ఎంపీపీ పోటే శోభాబాయి, జడ్పీ కోఆప్షన్ సభ్యుడు మహ్మద్ అబ్దుల్ అమ్జద్, మాజీ ఎంపీపీ కనక తుకారాం, సర్పంచ్లు ఏర్మ జాకేశ్వర్, జాదవ్ లఖన్సింగ్, టీఆర్ఎస్ మాజీ మండలాధ్యక్షుడు షేక్ సుఫియాన్, ఎంపీటీసీలు మంజూశ, కోవ రాజేశ్వర్, లక్కారాం మాజీ సర్పంచ్ మర్సుకోలా తిరుపతి, షెడ్యుల్ క్యాస్ట్ ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు మహేందర్దుర్గే, ఎంఈవో నారాయణ, నాయకులు ఆర్కా ఖమ్ము, శ్రీహరి, సంతోష్మహరాజ్, సతిష్, సునిల్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం మండలంలోని ధనోరా(బి)గ్రామంలో మహిళలకు బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు.