కుమ్రం భీం ఆసిఫాబాద్, మే 27(నమస్తే తెలంగాణ) : జిల్లాలో రైతులు సాగు చేస్తున్న పోడు భూముల సమస్యకు పరిష్కా రం లభించింది. ప్రభుత్వం ప్రత్యేకంగా పోడు రైతు ల నుంచి గతేడాది దరఖాస్తులు స్వీకరించింది. క్షేత్రస్థాయిలో భూములను అటవీ, రెవెన్యూ, గిరిజన శాఖల అధికారులు మండల స్థాయి కమిటీ ద్వారా సర్వేలు చేశారు. పట్టాల కోసం 51,859 ఎకరాలకు సంబంధించి 13,177 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరందరికీ జాన్ 24 నుంచి పట్టాలను అధికారులు అందజేయనున్నారు. పట్టాల కోసం దశాబ్దకాలంగా నిరీక్షిస్తున్న రైతుల సమస్యకు తెలంగాణ సర్కారు పరిష్కారం చూపిస్తోంది.
వివాదాలు తలెత్తకుండా చర్యలు
భవిష్యత్లో వివాదాలు తలెత్తకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకున్నారు. అన్ని గ్రామాల్లో అధికారులు గ్రామసభలు నిర్వహించి సమస్యలు లేని రికార్డులను తయారు చేశారు. భవిష్యత్లో అటవీ, రెవెన్యూ శాఖల నుంచి వివాదాలు తలెత్తకుండా చర్యలు తీసుకున్నారు. ప్రత్యేక సాఫ్ట్వేర్తో జీపీఎస్ ద్వారా సర్వేలు నిర్వహించారు. గిరిజనులు సాగు చేసుకుంటున్న భూములు 2005 డిసెంబర్ కంటే ముందు ఉన్న గూగుల్ మ్యాప్తో ప్రస్తుతం రైతు సాగు చేసుకుంటున్న భూములను ప్రస్తుత గూగుల్ మ్యాప్తో పరిశీలించారు. ప్రత్యేకంగా ఎస్డబ్ల్యూ అనే సాఫ్ట్వేర్ ద్వారా భూమి స్వభావం పూర్తిగా గుర్తించారు. 2005 కంటే ముందు అక్కడ అడవి ఉండేదా? లేక సాగులో ఉండేదా? అనే విషయాలు ఆన్లైన్ ద్వారా నమోదు చేశారు. ఆధారాలు సరిచూసి అర్హులైన రైతుల జాబితా తయారు చేశారు. పోడు రైతులకు పట్టాలు ఇచ్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుండడంతో పోడు రైతుల్లో ఆనందం వ్యక్తమవుతోంది.
సీఎంకు రుణపడి ఉంటం
మా ఊరి శివారులో మాకు నాలుగెకరాల భూమి ఉంది. ఇప్ప టి దాకా పట్టాలు లేవు. మస్తు తిప్పల పడుతున్నం. ప్రభు త్వం ఇచ్చే పథకాలు పొందలేక పోతున్నం. ఇప్పుడు సీఎం కేసీఆర్ సార్ పోడు భూములకు పట్టాలి స్తామని చెప్పిండు. ఇందుకు చాలా సంతో షంగా ఉంది. పట్టా రాంగనే ప్రభుత్వ పథకాల కోసం దరఖాస్తు చేసుకుంట. ఇగ ఢోకా ఉండదు. అటవీశాఖ అధికారులతో తిప్పలుండవు. మా భవిష్యత్కు భరోసాని స్తున్న కేసీఆర్కు జీవితాంతం రుణపడి ఉంటం.
– మడావి రాధాబాయి, కొలాం ఝరి
ఎన్నో ఏండ్ల సంది ఎదురుచూస్తున్నం
నాకు ఐదెకరాలు ఉంది. గతంలో సర్వే కూడా చేసిన్రు. పోడు పట్టాల కోసం ఎన్నో ఏండ్ల సంది ఎదురుచూస్తున్నం. ఇది వరకున్న నాయకులు మా బాధలను పట్టించుకున్న పాపాన పోలేదు. ఆఫీసుల సుట్టూ తిరిగి తిరిగీ యాష్టకొచ్చేది. తెలంగాణ వచ్చి కేసీఆర్ ముఖ్యమంత్రి అయినంక మాకు భరోసానిచ్చిండు. పోడు భూములకు పట్టాలిస్తమని చెప్పిండు. మరికొద్ది రోజుల్లోనే పట్టా చేతికి వస్తుంది. మా బతుకు గురించి ఆలోచన చేసిన ముఖ్యమంత్రి సారు చాలా గొప్పోడు. ఎప్పటికీ ఆయన తొవ్వలోనే నడుస్తం. – సిడాం ముత్త, కొలాం ఝరి
సమస్యలన్నీ తీర్చినట్లే
మాకు వ్యవవసాయమే జీవనాధారం. భూమి పట్టాలు ఇస్తే సమస్యలన్నీ పరిష్కారం అయినట్లే. ఎందుకంటే మా బతుకంతా భూమితోనే. ఎవుసం చేస్తేనే బుక్కెడు బువ్వ దొరుకుతది. ఇంతకాలం అటవీ అధికారులతో పడ్డ బాధలన్నీ తీరిపోతాయి. మా పోడు భూములకు పట్టాలు ఇచ్చేం దుకు సర్కారు చర్యలు తీసుకుంది. మా భూములకు పట్టాలు వస్తే మాకు బ్యాంకులోన్లు, రైతుబంధు, రైతు బీమావంటి పథకాలన్నీ వర్తిస్తాయి. మాకు పట్టాలు ఇస్తున్న ముఖ్యమంత్రి సార్కు రుణపడి ఉంటాము. -మడావి అన్నిబాయి, కొలాం ఝరి, కెరమెరి