రాష్ట్ర సర్కారు పేద విద్యార్థుల చదువులకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నది. బడులను బాగు చేయడం, కోట్ల రూపాయలు మంజూరు చేసి సకల సౌకర్యాలు కల్పించడం, నిష్ణాతులైన ఉపాధ్యాయులను నియమించడం వంటివి చేస్తూ ప్రోత్సహిస్తున్నది. ఇందులో భాగంగానే రెసిడెన్షియల్ స్కూల్స్లో విద్యను అభ్యసిస్తున్న వారి చదువులు మధ్యలో ఆగిపోకూడదనే ఉద్దేశంతో మహాత్మా జ్యోతిబా పూలే బీసీ రెసిడెన్షియల్ విద్యాలయాలను నెలకొల్పింది. ఆదిలాబాద్ జిల్లాలో ఆరు ఉండగా.. 3,320 మంది చదువుకుంటున్నారు. వీటిలో ఐదు బీసీ రెసిడెన్షియల్ స్కూళ్లను అప్గ్రేడేషన్ చేసి జూనియర్ కళాశాలలను ఏర్పాటు చేసింది. మరో బీసీ మహిళా డిగ్రీ కళాశాలను కూడా మంజూరు చేసింది.
– ఆదిలాబాద్, సెప్టెంబర్ 16(నమస్తే తెలంగాణ)
ఆదిలాబాద్, సెప్టెంబర్ 16(నమస్తే తెలంగాణ) : ఉమ్మడి రాష్ట్రంలో పాలకుల నిర్లక్ష్యం కారణంగా ఆదిలాబాద్ జిల్లాలో విద్యారంగం అస్తవ్యస్తంగా ఉండేది. ప్రభు త్వ పాఠశాలలు, కళాశాలల్లో వసతులు లేక చదువులు ముందుకు సాగేవి కావు. పేద విద్యార్థులకు చదువుకోవాలనే ఆసక్తి ఉన్నా.. గత ప్రభుత్వాల ప్రోత్సాహం లేకపోయేది. దీంతో ప్రతిభ గల విద్యార్థులు మధ్యలోనే చదువు మానేయాయాల్సిన దుస్థితి. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వా త ప్రభుత్వం విద్యారంగంపై ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగా కేజీ టు పీజీ వరకు ఉచిత విద్యను అందిస్తోంది. అన్ని వర్గాలకు చెందిన పిల్లలు ఉచితంగా విద్యను అభ్యసించేలా రెసిడెన్షియల్ స్కూళ్లను ఏర్పాటు చేసింది.
విద్యార్థుల చదువు మధ్యలో ఆగిపోకుండా రెసిడెన్షియల్ స్కూళ్లలో కార్పొరేట్ స్థాయిలో ఇంటర్ విద్యను ప్రవేశపెట్టింది. ఆదిలాబాద్ జిల్లాలో ఆరు బీసీ రెసిడెన్షియ ల్ జ్యోతిబా పూలే విద్యాలయాలు పేద విద్యార్థులకు వరం గా మారాయి. వీటిల్లో 3,320 మంది విద్యార్థులు ఐదు నుంచి ఇంటర్ వరకు చదువుకుంటున్నారు. ఆదిలాబాద్ బాలికల మహాత్మా జ్యోతిబా పూలే విద్యాలయంలో ఐదు నుంచి ఇంటర్ వరకు తరగతులు ఉండగా.. 640 మంది విద్యార్థినులు, బాలుర స్కూల్, జూనియర్ కళాశాలలో 640, జైనథ్ బాలుర స్కూల్, కళాశాలలో 640, తాంసి మండలం ఈదుల సవర్గాం స్కూల్, జూనియర్ కళాశాలలో 640, జైనథ్ మహాత్మా జ్యోతిబా పూలే బాలికల విద్యాలయంలో 540, ఇచ్చోడ మండలం నర్సాపూర్ స్కూల్, కళాశాలలో 540, బేల బీసీ రెసిడెన్షియల్ స్కూల్ లో 320 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు.
ఐదు విద్యాలయాల్లో ఇంటర్ విద్య
ఆదిలాబాద్ జిల్లాలో ఐదు బీసీ రెసిడెన్షియల్ జూనియ ర్ కళాశాలలు ఉన్నాయి. ఆదిలాబాద్ నియోజకవర్గంలో ఆదిలాబాద్ బాలికలు, జైనథ్లో బాలురు, బాలికల మహాత్మజ్యోతి బాపూలే జూనియర్ కళాశాలలు ఉన్నాయి. ఆదిలాబాద్, జైనథ్ జూనియర్ కళాశాలల్లో మొదటి సంవత్సరంలో 130 మంది, రెండో సంవత్సరంలో 144 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. జైనథ్ బాలుర జూనియర్ కళాశాలలో మొదటి సంవత్సరంలో 92 మంది, రెండో సంవత్సరంలో 52 మంది విద్యార్థులు ఉన్నారు.
బోథ్ నియోజకవర్గంలో తాంసి మండలం ఈదులసవర్గాం, ఇచ్చోడ మండలం నర్సాపూర్లో మహాత్మా జ్యోతి బా పూలే జూనియర్ కళాశాలలు ఉన్నాయి. ఈదుల సవర్గాం జూనియర్ కళాశాలలో మొదటి సంవత్సరంలో 52 మంది, రెండో సంవత్సరంలో 67 మంది విద్యను అభ్యసిస్తున్నారు. నర్సాపూర్ జూనియర్ కళాశాలలో మొదటి సంవత్సరంలో 35 మంది చదువుకుంటున్నారు. వీటితోపాటు ఆదిలాబాద్లో బీసీ రెసిడెన్షియల్ మహిళా డిగ్రీ కళాశాలను ప్రభుత్వం మంజూరు చేయగా.. అడ్మిషన్లు కొనసాగుతున్నాయి. ప్రభుత్వం అందిస్తున్న సహకారంతో విద్యార్థులు చదువుల్లో ప్రతిభ కనబరుస్తూ బంగారు భవిష్యత్కు బాటలు వేసుకుంటున్నారు.