102 ఉమ్మడి జిల్లా ప్రోగ్రాం ఆఫీసర్ సామ్రాట్
ఎదులాపురం, మే 17 : వివిధ రకాల వైద్య పరీక్షల కోసం గర్భిణులను 102 వాహనాల్లో దవాఖానలకు క్షేమంగా తీసుకెళ్లాలని ఆ సిబ్బందికి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రోగ్రాం అధికారి సామ్రాట్ సూచించారు. డీఎంహెచ్వో నరేందర్ రాథోడ్ ఆదేశాల మేరకు మంగళవారం రిమ్స్కు వచ్చిన ఆయన, 102 వాహనాల పైలెట్లు, కో ఆర్డినేటర్లతో మాట్లాడారు. జిల్లాలోని మారుమూల గ్రామాల నుంచి గర్భిణులు, బాలింతలను దవాఖానకు, అక్కడి నుంచి ఇంటికి క్షేమంగా చేరవేయాలన్నారు.
ఫైలెట్, 102 కోఆర్డినేటర్, అశ కార్యకర్తలు సమన్వయంతో గర్భిణులకు ఇబ్బందుల్లేకుండా చూడాలని సూచించారు. రిమ్స్కు వచ్చిన గర్భిణులకు వైద్య పరీక్షలు పూర్తయ్యేదాకా సమన్వయం చేస్తూ ఉండాలన్నారు. ఆయన వెంట ఎన్హెచ్ఎం డీపీఎం అనిల్, డీడీఎం రమణ, 102 జిల్లా కోఆర్డినేటర్ విగ్నేష్, రిమ్స్ కోఆర్డినేటర్ పూజ, పైలెట్లు, ఆశ కార్యకర్తలు ఉన్నారు.