నార్నూర్, జూన్ 30 : పరిసరాలను శుభ్రంగా ఉంచుకొని, సీజనల్ వ్యాధులపై జాగ్రత్తలు పాటించాలని కలెక్టర్ రాహుల్రాజ్ అన్నారు. మండల కేంద్రంలో శుక్రవారం ఆయన పర్యటించారు. పల్లెప్రకృతివనం, నర్సరీలో మొక్కల పెంపకం, సెగ్రిగేషన్ షెడ్డు, వైకుంఠధామాన్ని ఆయన పరిశీలించారు. సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో నిరంతరం పారిశుధ్య పనులు చేపట్టి పరిసరాలను శుభ్రంగా ఉంచాలని, ప్రజలకు సీజనల్ వ్యాధులపై జాగ్రత్తలను వివరించాలని అధికారులకు సూచించారు. ముందు గా నార్నూర్లోని పల్లె ప్రగతిలో భాగంగా చేపట్టిన పల్లె ప్రకృతి వనాన్ని నిరంతరం పర్యవేక్షించాలన్నారు. నర్సరీని పరిశీలించి రాబోయే హరితహారానికి లక్ష్యం మేరకు మొక్కలు పెంచాలని, పిచ్చి మొక్కలను ఎప్పటికప్పుడు తొలగించాలని ఈజీఎస్ ఏపీవో రాథోడ్ సురేందర్, పంచాయతీ కార్యదర్శి దినేశ్కు సూచించారు. వైకుంఠధామంలో స్నానపు గదులకు డోర్లను ఏర్పాటు చేసి పూర్తి వినియోగంలోకి తీసుకురావాలన్నారు. పాఠశాల సమీపంలో ఉన్న సెగ్రిగేషన్ షెడ్డును మరోచోటుకు మార్చేలా చూడాలని ఎంపీడీవో కావల రమేశ్కు ఆదేశించారు. అనంతరం ఏకలవ్య గురకుల, జిల్లా పరిషత్ పాఠశాలను తనిఖీ చేశారు. విద్యార్థుల పఠన సామర్థ్యాన్ని పరిశీలించారు. వసతు కల్పన వంటి వివరాలను విద్యార్థులు, ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. పాఠశాల సమీపంలోని ఇళ్లకు వెళ్లి బడీడు పిల్లలతో ముచ్చటించారు. ప్రతి రోజూకు పాఠశాలకు వెళ్లాలని సూచించారు. ఆయన వెంట ఎంఈవో రాపెల్లి ఆశన్న, డిప్యూటీ తహసీల్దార్ అమృత్లాల్, ఆర్ఐ రాథోడ్ కవిత, సూపరింటెండెంట్ గంగాసింగ్, కార్యదర్శి అనురాగ్,ప్రిన్సిపాల్ ఉపేందర్, ప్రధానోపాధ్యాయురాలు అరుణ ఉన్నారు.
అధికారిక ఫేస్బుక్ అకౌంట్ ప్రారంభం
ఎన్నికలు-2023 దృష్యా అధికారిక ఫేస్బుక్ అకౌంట్ Collector adb Adbని క్యాంపు కార్యాలయంలో జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాహుల్ రాజ్ ప్రారంభించారు. కార్యక్రమంలో ఎన్నికల విభాగం పర్యవేక్షకురాలు నలందప్రియ, ఈడీఎం రవి, తదితరులు పాల్గొన్నారు.