ఎదులాపురం,జనవరి30: ప్రజల సమస్యలు పరిష్కరించేందుకే ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. ఆదిలాబాద్ కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో ప్రజల నుంచి ఆయన అర్జీలు స్వీకరించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోరుతూ దరఖాస్తులు ఇచ్చారు.ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడారు. అర్హులకు ఆసరా పింఛన్లను నిబంధనల ప్రకారం మంజూరు చేస్తామని చెప్పారు. అంతకుముందు స్వాతంత్య్ర పోరాటంలో అమరులైన వీరులకు రెండు నిమిషాలు మౌనం పాటించి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఆర్డీవో రమేశ్ రాథోడ్, వివిధ శాఖల అధికారులు ఉన్నారు.
ర్యాంప్ ఏర్పాటు చేయాలి వినతి
ఆదిలాబాద్ మున్సిపల్ నూతన భవన నిర్మాణంలో ర్యాంప్ ఏర్పాటు చేయాలని ఎన్పీఆర్డీ దివ్యాంగుల హక్కుల జాతీయ వేదిక జిల్లా అధ్యక్షుడు మహ్మద్ ఇమ్రాన్ కోరారు. ఎన్పీఆర్డీ ఆధ్వర్యంలో అదనపు కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. మున్సిపల్ నూతన భవన నిర్మాణంలో ర్యాంప్ లేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. జిల్లా ప్రధాన కార్యదర్శి ఫైసల్ హైమ ద్, జిల్లా ఉపాధ్యక్షుడు తార ఊశన్న ఉన్నారు.
సమస్యల పరిష్కారానికి కృషి
ఉట్నూర్, జనవరి30 : గిరిజనుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు ఉట్నూర్ ఐటీడీఏ పీవో వరుణ్రెడ్డి అన్నారు. ఐటీడీఏ ప్రాంగణంలోని సమావేశ మందిరంలో సోమవారం దర్బార్ నిర్వహించారు. ఐటీడీఏ పరిధిలోని పలువురు గిరిజనులు తమ సమస్యల పరిష్కారానికి అర్జీలు ఇవ్వగా, వాటిని ఆయా శాఖల అధికారులకు బదిలీ చేశారు. కార్యక్రమంలో డీడీ దిలీప్ కుమార్, ఏపీవో జనరల్ కనక భీంరావు, ఏజెన్సీ వైద్యాధికారి కుమ్రం బాలు, పీటీజీ ప్రత్యేక అధికారి భాస్కర్, ఈఈ రాథోడ్ భీంరావు, ప్రిన్సిపాల్ మెస్రం మనోహర్, హెచ్వో సుధీర్, డీపీవో ప్రవీణ్, వివిద శాఖల అధికారులు, సిబ్బంది, గిరిజనులు పాల్గొన్నారు.
గిరిజనులకు నాణ్యమైన విద్యనందించాలి
గిరిజనులకు నాణ్యమైన విద్యనందించాలని ఐటీడీఏ పీవో వరుణ్రెడ్డి అన్నారు. స్థానిక పీవో క్యాంప్ కార్యాలయంలో సోమవారం గిరిజన సంక్షేమ ఉపాధ్యాయ సంఘం క్యాలెండర్ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పెండ్యాల విజయ శేఖర్, జాదవ్ శివాజీ, గౌరవాధ్యక్షుడు మడావి లక్ష్మణ్, టేకం గోవింద్రావు, నెహ్రూ, ఇందిర, పుష్పలత, చంపావతి, యాసిన్ ఫరీఫ్, భూమేష్, గోవింద్రావు, సంతోష్, దేవ్షా, మాణిక్రావు, విఠల్, రాజేశ్, శ్రీనివాస్, రాములు, కైలాస్, సురేందర్ పాల్గొన్నారు.