ఎదులాపురం, ఫిబ్రవరి16: ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని పోలీస్ హెడ్క్వార్టర్స్లో రెండో రోజు మహిళా అభ్యర్థులకు పోలీస్ కానిస్టేబుల్, ఎస్ఐ దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించినట్లు ఎస్పీ డీ ఉదయ్ కుమార్ రెడ్డి తెలిపారు. 772 అభ్యర్థులకు గాను 626 అభ్యర్థులు హాజరైనట్లు పేర్కొన్నారు. 279 మంది అభ్యర్థులు అన్ని పరీక్షల్లో ఉత్తీర్ణులై తుదిరాత పరీక్షకు అర్హత సాధించారని పేర్కొన్నారు. సీసీటీవీ కెమెరాల నిఘాలో ఈ పరీక్షలు నిర్వహించినట్లు పేర్కొన్నారు.
కార్యక్రమంలో జిల్లాలోని మహిళా అధికారులతో పాటు అదనపు ఎస్పీలు ఎస్ శ్రీనివాసరావు, బీ రాములు నాయక్, సీ సమయ్ జాన్రావు, ఆర్ వెంకటేశ్వర్లు, పోలీసు కార్యాలయం పరిపాలన అధికారి యూనుస్ అలీ, డీఎస్పీలు వీ ఉమేందర్, సీహెచ్ నాగేందర్, ఉమామహేశ్వరరావు, పోతారం శ్రీనివాస్, సూపరింటెండెంట్లు జోసెఫిన్, గంగాధర్, సీఐలు, ఎస్ఐలు, ట్రాఫిక్ సిబ్బంది, ఐటీ కోర్, ఫింగర్ ప్రింట్, కమ్యూనికేషన్ విభాగాల అధికారులు పాల్గొన్నారు.