ఎదులాపురం, డిసెంబర్ 20 : బాలికపై దాడి చేసిన ఓ వ్యక్తికి ఆరు నెలల సాధారణ జైలుశిక్ష విధిస్తూ పోక్సో కోర్టు న్యాయమూర్తి డీ మాధవీకృష్ణ తీర్పువెలువరిచినట్లు పోక్సో కోర్టు లైజన్ అధికారి జీ పండరి తెలిపారు. తీర్పునకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. బేల మండలంలో 2018 జూలై 20న ఓ గ్రామానికి చెందిన బాలిక(12) ఇంట్లో సాయంత్రం వంట చేస్తున్నది.
ఇంట్లో ఎవరూ లేని సమయంలో బేల మండలం వడగూడకు చెందిన జుగ్నాకే చిత్రు (32) చొరబడి దాడి చేసి, దుర్భాషలాడాడు. ఆమె అడ్డగించినందుకు కాలిపై కొరికి పారిపోయాడు. తండ్రి ఫిర్యాదు మేరకు అప్పటి బేల ఎస్ఐ సాయ న్న అదే రోజు కేసు నమోదు చేశారు. జైనథ్ సీడీవో ఎంఏ జమీర్ సాక్షులను కోర్టులో ప్రవేశ పెట్టగా ప్రత్యేక పీపీ ఎం రమణారెడ్డి నేరం రుజువుచేశారు.