ఆసిఫాబాద్,మార్చి 20: ఆదివాసీల అభ్యున్నతికి కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని ఐటీడీఏ పీవో ఖుష్బూగుప్తా అన్నారు. మండలంలోని రౌట సంకెపల్లి గ్రామంలో చేపట్టిన అభివృద్ధి పనులను బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా పీవో మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అర్హులందరికీ చేర్చేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు.
గిరిజన గ్రామాల అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు వివరించారు. ఎంపీపీ మల్లికార్జున్ యాదవ్, ఎంపీటీసీ సత్రవేణి మల్లేశ్, అసిస్టెంట్ ఇంజినీర్ నజీమొద్దీన్ తదితరులున్నారు.