మెరుగైన ఫలితాల సాధనకు ఉపాధ్యాయుల ప్రణాళిక
విద్యార్థులకు రోజు ప్రత్యేక తరగతులు.. సందేహాల నివృత్తి
ఇచ్చోడ/నార్నూర్, ఫిబ్రవరి 17 ః పదో తరగతి వార్షిక పరీక్షల్లో విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించడానికి జడ్పీ, కేజీబీవీ, మోడల్ స్కూల్స్, గిరిజన ఆశ్రమోన్నత, గురుకుల పాఠశాలల ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. మార్చి 18వ తేదీన నిర్వహించే పరీక్షలకు సన్నద్ధం చేస్తున్నారు. ఇందుకుగాను ప్రభుత్వం నవంబర్ 1వ తేదీ నుంచి ప్రత్యేక తరగతులను ప్రారంభించింది. రోజు ఉదయం 8.30 నుంచి 10 గంటల వరకు.. సాయంత్రం 4.30 నుంచి 5. 30 గంటల వరకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. మొదటి ప్రీ ఫైనల్ పరీక్షలు మార్చి 1 నుంచి 11 వ తేదీ వరకు ఉండగా.. మార్చి18 నుం చి వార్షిక పరీక్షలు జరుగనున్నాయి. ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 10,405 మంది విద్యార్థులు పరీక్షలు రాయనుండగా.. ఇందులో బాలికలు 5,1 92, బాలురు 5,213 ఉన్నారు. ప్ర త్యేక తరగతుల్లో విద్యార్థుల సందేహాలను నివృత్తి చేస్తున్నారు. తక్కువ మా ర్కులు వస్తున్న విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. ఈ యేడాది ఏడు పేపర్లు ఉంటాయని, దీనిపై కూడా అవగాహన కల్పిస్తున్నారు.