భీమారం, ఏప్రిల్ 1 : నడిసముద్రంలో విధులు.. కనుచూపు మేర కూడా కనిపించని భూభాగం.. ప్రమాదకర జలాల్లో ప్రయాణం.. అయినా వెనక్కి తగ్గలేదు. తనకిష్టమైన ఉద్యోగం సాధించేందుకు పట్టుదలతో ముందుకు సాగాడు. అనుకున్నది సాధించాడు. చిత్తశుద్ధి ఉంటే పేదరికం అడ్డుకాదని నిరూపించి.. అట్లాంటిక్ మహాసముద్రంలో అసిస్టెంట్ నేవిగేషన్ ఆఫీసర్గా విధులు నిర్వర్తిస్తున్నాడు పవన్ కల్యాణ్.
గురుకులం నుంచి..
మంచిర్యాల జిల్లా చెన్నూర్ మండలం గంగారానికి చెందిన కామెర లక్ష్మి-దుర్గయ్య దంపతుల పెద్ద కొడుకు పవన్ కల్యాణ్. భీమారం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలో 2014లో 8వ తరగతి పూర్తి చేశాడు. అదే పాఠశాలలో నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ శిక్షణను పాఠశాల గణిత ఉపాధ్యాయుడు ఏలె విజయ్ కుమార్ ఇచ్చాడు. దీంతో (ఎన్ఎంఎంఎస్) స్కాలర్షిప్తోపాటు స్కూల్ ఆఫ్ ఎక్స్లెన్స్ కరీంనగర్లో సీటు సాధించాడు. తొమ్మిదో తరగతి నుంచి ఇంటర్ వరకు కరీంనగర్లోని సోషల్ వెల్ఫేర్ గురుకులం(సీవోఈ)లో చదివాడు. అనంతరం ఇండియన్ మెరైన్ యూనివర్సిటీ(ఐఎంయూ) చెన్నయ్కి ప్రవేశ పరీక్ష రాసి అర్హత సాధించాడు. కానీ.. అక్కడ చేరాలంటే రూ.లక్షల్లో ఫీజుల్లో కావాలి. నిరుపేద కుటుంబం కావడంతో ఇబ్బందులు ఎదురయ్యాయి. దీంతో ప్రభుత్వం, గురుకులాల సొసైటీ కార్యదర్శి అందించిన సహకారాన్ని సద్వినియోగం చేసుకొని విద్యాభ్యాసాన్ని పూర్తి చేశాడు. అనంతరం చెన్నయ్లోనే జాబ్ సంపాదించాడు. మర్చంట్ నేవీకి చెందిన వాణిజ్య నౌకలో అసిస్టెంట్ నేవిగేషన్ ఆఫీసర్గా విధులు నిర్వర్తిస్తున్నాడు.
ఇప్పుడు ‘అట్లాంటిక్’లో..
ప్రస్తుతం కామెర పవన్ కల్యాణ్ అట్లాంటిక్ మహా సముద్రంలో ట్రైనీ నేవిగేషన్ ఆఫీసర్గా విధులు నిర్వర్తిస్తున్నాడు. భారీ వేతనం, సౌకర్యాలతోపాటు వివిధ దేశాల మధ్య నడిచే వాణిజ్య నౌకలో విధులు నిర్వహిస్తున్నాడు. ప్రపంచ దేశాలను కలుపుకుని ఈ ప్రయాణం కొనసాగుతోంది. బ్రెజిల్ , చైనా, మలేషియా, సింగపూర్ దేశాల మీదుగా ఈ వాణిజ్య నౌక ప్రయాణం ఉంటుంది. ఇలా ఒక్కో ప్రయాణం అక్కడి పోర్టు పరిస్థితులను బట్టి మూడు నెలలు పడుతుంది. ఈ సమయంలో భోజనం, వసతి వారే కల్పిస్తారు.
ప్రభుత్వ ప్రోత్సాహంతోనే..
తెలంగాణ సర్కారు ప్రోత్సహంతోనే ఈ ఉద్యోగంలో చేరిన. ఎంతో మంది గురువులు నాకు సహాయం చేశారు. గురుకుల సొసైటీతోనే ఇది సాధ్యం అయ్యింది. మాది నిరుపేద కుటుంబం, నా చదువు కోసం అమ్మనాన్నలు ఎంతో కష్టపడ్డారు. ఈ స్థాయికి వచ్చానంటే వారి శ్రమే కారణం. ఇప్పుడు ఉద్యోగం చేస్తున్నందుకు నాతోపాటు వాళ్లంతా సంతోషంగా ఉన్నారు. యువత కష్టపడితే ఏదైనా సాధించవచ్చు. ప్రస్తుతం మర్చంట్ నేవీకి చెందిన వాణిజ్య నౌకలో పనిచేస్తున్నా.
– పవన్ కల్యాణ్
పట్టుదల ఉన్న విద్యార్థి పవన్ కల్యాణ్
పవన్ కల్యాణ్ క్రమశిక్షణ కలిగిన విద్యార్థి. భిన్నమైన రంగంలోకి వెళ్లాలని అనుకునేవాడు. ఎంతో పట్టుదలతో సాధించి చూపాడు. ఎంతో తెలివైన విద్యార్థి. ఆటల్లోనూ ప్రతిభ చూపేవాడు. ప్రస్తుతం వాణిజ్య నౌక అసిస్టెంట్ నేవిగేషన్ ఆఫీసర్గా విధులు నిర్వర్తిస్తున్నాడు. రానున్న కాలంలో మరింత ఎదిగే అవకాశం ఉంది. పవన్ కల్యాణ్ సమర్థత పై మాకు నమ్మకం ఉంది.
– ఏలే విజయ్ కుమార్, గణిత ఉపాధ్యాయుడు
గర్భిణులు వినియోగించుకోవాలి..
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా అమ్మఒడి వాహనాలు 43 ఉన్నాయి. గర్భిణులు మూడో నెల నుంచి తొమ్మిదో నెల వరకు ఈ సేవలను వినియోగించుకోవచ్చు. వీరిని సురక్షితంగా దవాఖానకు తరలించి చికిత్స అందిస్తాం. ప్రసవానంతరం బాలింతలను ఇంటికి చేరుస్తున్నాం. గర్భిణులు 102 సేవలను ఎన్ని సార్లయిన వినియోగించుకోవచ్చు.
– బయ్య సామ్రాట్, ఉమ్మడి జిల్లా 108, 102 ప్రొగ్రాం మేనేజర్
ఇబ్బందులు లేకుండా తీసుకెళ్తున్నారు..
102 వాహనాలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా దవాఖానకు తీసుకెళ్తున్నాయి. ఒక్క ఫోన్ కొట్టగానే బండి ఇంటి ముందుకొచ్చి ఉంటుంది. చాలా మంచిగ అనిపిస్తుంది. ఆటోలు, బస్సుల్లో వెళ్లాలంటే వ్యయంతో కూడుకున్న పని. తెలంగాణ ప్రభుత్వం గర్భిణులు, బాలింతల కోసం మంచి నిర్ణయం తీసుకోవడం సంతోషం.
– అనూష, కృష్ణ కాలనీ, గర్భిణీ.