సీసీసీ నస్పూర్, అక్టోబర్ 29: దేశానికి వెలుగులు అందిస్తున్న సింగరేణి కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపిన సీఎం కేసీఆర్ను మరోసారి గెలిపించుకుందామని పెద్దపల్లి ఎంపీ బొర్లకుంట వెంకటేశ్ నేతకాని, మంచిర్యాల నియోజకవర్గం ఇన్చార్జి, ఎమ్మెల్సీ భానుచందర్రావు, మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్రావు పేర్కొన్నారు. నస్పూర్లోని మంచిర్యాల జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఆదివారం టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో శ్రీరాంపూర్ ఏరియా సింగరేణి కార్మికులు, రిటైర్డ్ కార్మికుల ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశం లో ఎంపీ వెంకటేశ్ నేతకాని మాట్లాడుతూ కార్మికులకు ఆదాయపన్ను నుంచి మినహాయింపు ఇవ్వాలని సీఎం కేసీఆర్ అ సెంబ్లీలో తీర్మానం చేసి పంపినా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పట్టించుకోలేదని గుర్తు చేశారు. పార్లమెంట్ సమావేశాల్లో తాను కూడా ఐటీ రద్దు చేయాలని పట్టుబట్టినా స్పందించలేదని ఎంపీ తెలిపారు. మంచిర్యాల నియోజకవర్గంలో సింగరేణి కార్మికుల ఓట్లే కీలకమని, బీఆర్ఎస్కు ఓటేయాలని కోరారు. అనంతరం నియోజకవర్గ ఇన్చార్జి, ఎమ్మెల్సీ భానుప్రసాద్రావు మాట్లాడు తూ అనేక ఉద్యమాల్లో సింగరేణి కార్మికుల పాత్ర కీలకమన్నా రు. చైతన్యవంతులైన సింగరేణి కార్మికులు బీఆర్ఎస్ ప్రభు త్వం అమలు చేసిన సంక్షేమాభివృద్ధి పథకాలు, సాధించిన హక్కులను గుర్తు చేసుకొని బీఆర్ఎస్కు ఓటేయాలని కోరారు.
పొరపాటున ఇతర పార్టీలకు ఓటేస్తే అభివృద్ధిలో మనం వెనక్కివెళ్లడం తప్పదన్నారు. సీఎం కేసీఆర్ దిశానిర్దేశంలోనే సింగరేణి అభివృద్ధిలో దూసుకుపోతున్నదని, వారి కష్టాన్ని చూసి కార్మికులకు అనేక హక్కులు కల్పిస్తున్నారని మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు స్పష్టం చేశారు. తాను మంచిర్యాల నియోజకవర్గంలో నాలుగు సార్లు ఎమ్మెల్యే అయ్యానని, తన గెలుపులో సింగరేణి ప్రాంత కార్మికులు, కార్మికేతరుల కృషి ఎంతో ఉందన్నారు. కార్మికులకు అనేక హక్కులు కల్పించిన సీఎం కేసీఆర్ మరోసారి ముఖ్యమంత్రి కావాలంటే మంచిర్యాల గడ్డంపై మరోసారి గులాబీ జెండాను ఎదురవేయాలని కోరారు. రౌడీయిజం, గుండాయిజం చేసే వారికి ఓటు వేస్తే అ భివృద్ధి జరగదని, వందలాది కోట్లు బ్యాంకులకు ఎగనామం పెట్టిన కాంగ్రెస్ అభ్యర్థికి ఓటు వేస్తే ఆయన దగ్గరకు వెళ్లే పరిస్థి తి ఉండదన్నారు. కాంగ్రెస్ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ప్రజ లు నమ్మవద్దని ఆయన కోరారు.
మాజీ ఎమ్మెల్యే గడ్డం అరవిందరెడ్డి, టీబీజీకేఎస్ అధ్యక్షుడు వెంకట్రావ్, వర్కింగ్ ప్రెసిడెంట్ కెంగర్ల మల్లయ్య, టీబీజీకేఎస్ ఏరియా ఉపాధ్యక్షుడు కేతిరెడ్డి సురేందర్రెడ్డి, కేంద్ర చర్చల ప్రతినిధి ఏనుగు రవీందర్రెడ్డి, కేంద్ర ఉపాధ్యక్షులు అన్నయ్య, మంద మల్లారెడ్డి, ఏరియా చర్చల ప్రతినిధులు వెంగల కుమారస్వామి, పెట్టం లక్ష్మణ్, ఏరియా కార్యదర్శి పానుగంటి సత్తయ్య, కాశీరావు, మున్సిపల్ చైర్మన్ ఈసంపల్లి ప్రభాకర్, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు అక్కూరి సుబ్బయ్య, కార్యదర్శి మెరుగు పవన్కుమార్, ఎస్సీ సెల్ పట్టణ అధ్యక్షుడు గర్శె రామస్వామి, ఏరియా స్థాయి నాయకులు, అన్ని గనులు పిట్ కార్యదర్శులు, కార్మికులు, వి శ్రాంత కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
కార్మికుల బంగారు భవిష్యత్తు కేసీఆర్తోనే సాధ్యమని టీబీజీకే ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెంగర్ల మల్లయ్య అన్నారు. తెలంగాణ ఉద్యమంలో సింగరేణి కార్మికులు కేసీఆర్ వెంటే నడిచారని, రాష్ట్రం కోసం 35 రోజులు సమ్మెలో పాల్గొన్నారని గుర్తుచేశా రు. కార్మికుల రుణం తీర్చుకోవడానికి కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత కార్మికులకు అనేక హక్కులు కల్పించారని వివరించారు. సింగరేణిలో కారుణ్యంతో పాటు వివిధ నోటిఫికేషన్ల ద్వారా 18వేల మందికి ఉద్యోగాలు ఇప్పించారని తెలిపారు. తొలిసారిగా సింగరేణిలో కారుణ్యం ద్వారా మహిళలకు ఉద్యోగావకాశం కల్పించినట్లు చెప్పారు.
కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ప్రైవేటీకరణకు పూనుకుంటే సీఎం కేసీఆర్ అడ్డుకున్నారని గుర్తు చేశారు. మా బతుకైనా.. భవిష్యత్తు అయినా.. గులాబీ జెండానే అనే రీతిలో ఎన్నికల్లో కార్మికవర్గమంతా పనిచేయాలని కోరారు. కార్యకర్తలంతా తాము సాధించిన హక్కులు, కల్పిస్తున్న సౌకర్యాలను గనులు, డిపార్ట్మెంట్ల వద్ద కార్మికులతో చర్చించాలని, బీఆర్ఎస్కు ఓటు వేసే విధంగా వారిలో చైతన్యం తీసుకురావాలని సూచించారు. సింగరేణి బతకాలంటే మళ్లీ గులాబీ జెండా ఎగురవేయాలని, మరోసారి బీఆర్ఎస్ను గెలిపిస్తేనే సింగరేణి మరింత లాభాల్లోకి వెళ్తుందన్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలు నెలరోజుల పాటు పార్టీ గెలుపుకోసం శ్రమించాలని ఆయన కోరారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో సింగరేణి సంస్థ లాభాల్లో దూసుకెళ్తున్నదని, సంస్థకు వ చ్చిన లాభాల్లో నుంచి ఏడాదికేడాది పెంచుతూ కార్మికులకు వాటాను చెల్లించడం జరుగుతుందని టీబీజీకేఎస్ అధ్యక్షుడు బీ వెంకట్రావ్ పేర్కొన్నారు. గత ప్రభుత్వాల హయాంలో 16శాతం ఉన్న లాభాల వాటాను తెలంగాణకు కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత పదేళ్ల కాలంలో 32 శాతానికి పెంచారని, తద్వారా కార్మికులు లక్షల్లో లాభాల వాటాను తీసుకోవడం జరిగిందన్నారు. దేశంలో ఏ బొగ్గు పరిశ్రమలో లేని హక్కులు సింగరేణి సాధించామని, ప్రైవేటీకరణ కాకుండా ఉండాలంటే మూడోసారి కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని పేర్కొన్నా రు. కార్మికులంతా బీఆర్ఎస్ వైపు నిలబడాలని కోరారు. సీఎం కేసీఆర్ వారసత్వ ఉద్యోగాలు ప్రకటిస్తే ఏఐటీయూసీ కోర్టుకు వెళ్లి అడ్డుకుందని ఆరోపించారు. అయినప్పటికీ ముఖ్యమంత్రి కేసీఆర్ కారుణ్య నియామకాలకు శ్రీకారం చుట్టారని తెలిపారు. ఇప్పుడు సింగరేణి అంతా యువ కార్మికులతో కళకళలాడుతున్నదన్నారు. సింగరేణి మనుగడలో ఉండాలంటే తప్పని సరిగా బీ ఆర్ఎస్ పార్టీ గెలవాలని, కార్మికులు, రిటైర్డ్ కార్మికులు, యువకార్మికులు గట్టి మద్దతునివ్వాలని కోరారు.