నస్పూర్, మార్చి 12 : పార్లమెంట్ ఎన్నిక లు సజావుగా నిర్వహించేందుకు సిద్ధంగా ఉం డాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ మోతీలాల్, ఎల్ఏ ఆర్అండ్ఆర్ ప్రత్యేక ఉపపాలనాధికారి చంద్రకళతో కలిసి ఎన్నికల అధికారులతో స మావేశం నిర్వహించారు. ఎన్నికల నేపథ్యంలో ఎలాంటి పొరపాట్లు లేకుండా సజావుగా సాగేలా అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు. కలెక్టరేట్లో 1950 కంట్రోల్ రూం ఏర్పాటు చేశామని, సీ విజిల్ యాప్ ద్వారా అందిన ఫిర్యాదులపై వెంటనే స్పందించి పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలన్నారు. రాజకీయపార్టీల సమావేశాలను రికార్డు చేయాలని, సమావేశాల ఖర్చులపై ప్రత్యేక నిఘా ఉంచాలన్నారు. రాజకీయ పార్టీలు, అభ్యర్థులు ప్రచార సమయంలో తప్పనిసరిగా అనుమతి పొందాలని తెలిపారు. అనంతరం పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా అధికారులకు వివరించారు. ప్లయింగ్ స్కాడ్, స్టాటిక్ సర్వేయలెన్స్ బృందాలు, అకౌంటింగ్ సిబ్బంది పాల్గొన్నారు.