ఎదులాపురం,సెప్టెంబర్22 : ఆదిలాబాద్ పట్టణాన్ని మరింత అభివృద్థి చేయడానికి రూ.50 కోట్ల నిధులను మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈమేరకు శుక్రవారం క్యాంపుకార్యాలయంలో బీఆర్ఎస్ పట్టణ నాయకులు, వార్డు కౌన్సిలర్లు సంబరాలు జరుపుకున్నారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, ఎమ్మెల్యే జోగు రామన్న ఫ్లెక్సీలకు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు అలాల్ అజయ్ మాట్లాడుతూ.. పట్టణ సుందరీకరణ, ప్రజలకు కనీస మౌలిక వసతులను కల్పించడమే ధ్యేయంగా ఎమ్మెల్యే జోగు రామన్న ప్రత్యేక చొరవతో రూ.50 కోట్ల నిధులు మంజూరయ్యాయన్నారు. ఇదివరకు ప్రభుత్వం పట్టణ సుందరీకరణ కోసం కోట్ల రూపాయలను కేటాయించిందని గుర్తుచేశారు. పార్టీలకు అతీతంగా అన్ని వార్డుల్లో అభివృద్ధి పనులు జోరుగా కొనసాగుతున్నాయని తెలిపారు. విలీన వార్డుల్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు స్పష్టం చేశారు. కార్యక్రమంలో బీసీ సెల్ అధ్యక్షుడు దాసరి రమేశ్, కౌన్సిలర్లు వెంకన్న, వవన్నాయక్, అశోక్స్వామి, ప్ర కాశ్, సాయిప్రణయ్, నాయకులు ప్రేమల, పర్వీన్, సురేఖ ఉన్నారు.
lసీఎం కేసీఆర్,మంత్రికి ధన్యవాదాలు తెలిపిన ఎమ్మెల్యే..
పట్ణణాభివృద్ధికి రూ.50 కోట్ల నిధులు మంజూరు చేసిన సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్కు ఆదిలాబాద్ బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే జోగు రామన్న ఒక ప్రకటనలో ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. సీఎం కేసీఆర్తోనే బంగారు తెలంగాణ సాధ్యమౌతుందన్నారు. పట్టణాభివృద్థికి మం జూరు చేసిన నిధులతో మరింత అభివృద్ధి చేస్తామని ఆయన పేర్కొన్నారు.
జంతర్ మంతర్ ర్యాలీలో ఆదివాసులు
ఎస్టీ జాబితా నుంచి లంబాడీ, యానది, సుగాలి కులస్తులను తొలగించాలని కోరుతూ ఆధర్ సొసైటీ ఆధ్వర్యంలో శుక్రవారం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద చేపట్టిన ధర్నాలో బోథ్ ప్రాంత ఆదివాసులు పాల్గొన్నారు. ఆదివాసులకు న్యాయం జరగాలంటే ఈ మూడు కులాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని కోరారు. కార్యక్రమంలో ఐటీడీఏ డైరెక్టర్ మెస్రం భూమన్న, సార్మెడిలు ఆడెం భీంరావు, మడావి గంగారాం, సురేశ్, సుదర్శన్, సర్పంచ్లు కొడప విజయ్, లింగు పాల్గొన్నారు.
పాఠశాలలో పాము కలకలం
మండలకేంద్రంలోని ఎంపీపీఎస్ పాఠశాలలో శుక్రవారం పాఠశాల గదిలోకి పాము రావడంతో విద్యార్థులు, ఉపాధ్యా యులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే ప్రధానోపాధ్యాయుడు వెంకటరమణారెడ్డి పాములను పట్టే (స్నేక్ క్యాచర్) సలీమ్ను సంప్రదించి పాఠశాలకు పిలిపించారు. సలీమ్ అక్కడికి చేరుకొని పామును పట్టుకోవడం తో విద్యార్థులు, ఉపాధ్యాయులు ఊపిరిపీల్చుకున్నారు. అనంతరం సలీమ్ పామును అడవిలో వదిలిపెట్టినట్లు హెచ్ఎం తెలిపారు.