మంచిర్యాల, డిసెంబర్ 15 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా వరి ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ ఊపందుకున్నది. ఇప్పటి వరకు 15.35 లక్షల టన్నుల ధాన్యం.. అంటే అక్షరా ల రూ.313.79 కోట్ల విలువైన ధాన్యాన్ని రాష్ట్ర ప్రభు త్వం కొనుగోలు చేసింది. వీరిలో సగం మంది రైతులకు ఇప్పటికే పేమెంట్ కూడా పూర్తయ్యింది. జిల్లా వ్యాప్తంగా 485 కేంద్రాలకుగాను 423 కేంద్రాల్లో ధాన్యం సేకరణ మొదలైంది. ఇందులో 40 కేంద్రాల్లో ఇప్పటికే కొనుగోళ్లు పూర్తికాగా, మిగిలిన కేంద్రాల్లో జనవరిలో ధాన్యం కొనుగోళ్లు పూర్తయ్యే అవకాశం ఉంది. గతేడాది 16.17 లక్షల టన్నుల ధాన్యం సేకరించగా, ఈ ఏడాది ఇప్పటికే 15.35 లక్షల టన్నుల కొనుగోళ్లు పూర్తయ్యాయి. వ్యాపారుల నుంచి వివరీతమైన పోటీ ఉన్నప్పటికీ గత సీజన్కంటే ఎక్కువ ధాన్యం సేకరించే ఛాన్స్ ఉంది.
వేగంగా కొనుగోళ్లు.. ఆ వెంటనే డబ్బులు..
ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ శరవేగంగా సాగుతున్నది. కల్లాల నుంచి కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ధాన్యా న్ని రెండు నుంచి మూడు రోజుల్లోనే మిల్లర్లకు తరలిస్తున్నారు. వర్షాలు వచ్చినా ఇబ్బందుల్లేకుండా ఏర్పా ట్లు చేస్తున్నారు. గతంలో ఒక జిల్లాలో కొన్న ధాన్యాన్ని మరో జిల్లాకు పంపేవారు. ఇలా తరలింపు ప్రక్రియ ఆలస్యమైంది. కానీ ఇప్పుడు ఏ జిల్లా ధాన్యాన్ని ఆ జిల్లాలోని మిల్లర్లకు పంపిస్తున్నారు. కుదరని పక్షంలో పక్కనున్న జిల్లాకు తరలిస్తున్నారు. లారీలు కూడా ఏ జిల్లా పరిధిలో ఆ జిల్లా లారీలే తిరుగుతున్నాయి. దీం తో గతంలో వేరే జిల్లాకు వెళ్లేందుకు రెండు మూడు రోజుల సమయం తీసుకునే లారీలు.. ఇప్పుడు ఒక్క రోజులోనే రెండు నుంచి మూడు ట్రిప్పులు వేస్తున్నా యి. దీంతో రవాణా ఛార్జీల భారం కూడా తగ్గుతుంది. ధాన్యం విక్రయించిన నాలుగు నుంచి ఆరు రోజుల్లో రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అవుతున్నాయి. రైతుల ఆనందానికి అవధుల్లేకుండా పోతున్నది.
ప్రైవేట్ నుంచి విపరీతమైన పోటీ..
జాతీయ.. అంతర్జాతీయ మార్కెట్లలో ధాన్యానికి విపరీతమైన డిమాండ్ ఉంది. దీంతో ప్రైవేటు వ్యాపారులు ధాన్యం కొనేందుకు పోటీ పడుతున్నారు. క్వింటాకు ప్రభుత్వం ఇస్తున్న మద్దతు ధర ఇస్తున్నారు. అది కూడా కొన్న వెంటనే పేమెంట్ పూర్తవుతుంది. పైగా కల్లాల దగ్గరకు వచ్చే తీసుకెళ్తున్నారు. దీంతో ప్రభుత్వ సెంటర్లలో విక్రయించి డబ్బుల కోసం ఎదురుచూడడం, పొలం నుంచి కేంద్రం వరకు ధాన్యాన్ని తీసుకెళ్లే శ్రమ తప్పుతుందనే ఉద్దేశంతో రైతులకు ప్రైవేటు వ్యాపారులకు ధాన్యం అమ్ముతున్నారు. దీంతో సేకరణ లక్ష్యం కొంత మేర తగ్గే అవకాశం ఉన్నా గతేడాది కంటే ఎక్కువ ధాన్యాన్ని మాత్రం సేకరిస్తామని అధికారులు చెబుతున్నారు.
ఆదిలాబాద్ జిల్లాలో..
జిల్లాలో ఎక్కువగా పత్తి సాగు అవుతుంది. ఇక్కడ వరి ధాన్యం చాలా తక్కువ. ఉట్నూరు డివిజన్ పరిధిలో మాత్రమే వరి పండిస్తారు. అందుకే ఇక్కడ ధాన్యం సేకరణ కూడా తక్కువగా ఉంటుంది. ఈ సీజన్లో 20,500 టన్నుల లక్ష్యంగా పెట్టుకోగా, ఇప్పటికే 13,100 టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. మరో 7,400 టన్నులు రావచ్చని అంచనా వేస్తున్నారు. గతేడాది జిల్లా నుంచి 29 వేల క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు చేశారు. ఇక్కడ కేవలం 4 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు.
ఆసిఫాబాద్ జిల్లాలో..
జిల్లాలో 72,000 టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. మొత్తం టార్గెట్ 1.10 లక్షల టన్నులు. గతేడాది 98,580 వేల టన్నుల ధాన్యం సేకరించారు. మరో 30 వేల నుంచి 40 వేల టన్నుల ధాన్యం రావొచ్చని అంచనా వేస్తున్నారు. జిల్లాలో 30 కొనుగో లు కేంద్రాలు ఏర్పాటు చేశారు. గతేడాది 27 కేంద్రాలు ఉంటే, ఈ ఏడాది అదనంగా మూడు కేంద్రాలు ఏర్పాటు చేశారు.
మంచిర్యాల జిల్లా..
జిల్లాలో 23.1 లక్షల టన్నుల ధాన్యం లక్ష్యం కాగా, 4 లక్షల టన్నులు కొన్నారు. గతేడాది 13.70 లక్షల టన్నులు సేకరించారు. కొనుగోలు చేసిన ధాన్యం విలువ రూ.82.40 కోట్లు కాగా, ఇందులో ఇప్పటికే రూ.16.23 కోట్లు రైతుల ఖాతాలో జమయ్యాయి. జిల్లాలో 243 కేంద్రాలకుగాను 185 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇందులో నాలుగు కేంద్రాల్లో ఇప్పటికే ధాన్యం సేకరణ పూర్తయ్యింది.
నిర్మల్ జిల్లాలో..
జిల్లాలో ఈ సీజన్లో 15.4 లక్షల టన్నుల ధాన్యం కొనాలనేది లక్ష్యం కాగా, ఇప్పటి వరకు 10.50 లక్షల టన్నుల ధాన్యం సేకరణ పూర్తయ్యింది. ఇప్పటికే రూ.108 కోట్లు రైతుల ఖాతాలో జమయ్యాయి. గత సీజన్లో ఈ జిల్లా నుంచి సుమారు 12 లక్షల టన్నుల ధాన్యం సేకరించారు. మరో 4 లక్షల నుంచి 5 లక్షల టన్నుల ధాన్యం రావొచ్చని అంచనా వేస్తున్నారు. జిల్లాలో 208 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాల్సి ఉండగా, ఇప్పటి వరకు 200 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇందులో 36 కేంద్రాల్లో ఇప్పటికే సేకరణ పూర్తయ్యింది.
24 గంటల్లోనే తూకం వేసిన్రు
సోన్, డిసెంబర్ 15 : నా పేరు వీరమల్ల మల్లయ్య. మాది నిర్మల్ మండలం వెంగ్వాపేట్ గ్రామం. నాకున్న నాలుగెకరాల్లో వరి సాగు చేసిన. కోత కోసి కొను గోలు కేంద్రానికి తరలించిన. తేమశాతం 24 గంటల్లోనే తూకం వేసిన్రు. ఇది వరకైతే వారం పాటు వడ్లు ఆరబెట్టినా కొనేటోళ్లు లేకుండే. ఈసారి ఆ తిప్పలు లేవు. నాలుగెకరాల్లో 72 క్వింటాళ్ల ధాన్యం దిగుబడి వచ్చింది. ప్రభుత్వం క్వింటాలుకు రూ. 2,060 మద్దతు ధర చెల్లించింది. నాకు మొత్తం రూ.1.48 లక్షలు వచ్చినయ్. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయడం వల్ల రైతులకు ఎంతో మేలు జరిగింది.
96 క్వింటాళ్ల వడ్లు అమ్మిన
దహెగాం, డిసెంబర్ 15 : సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వడ్ల కొనుగోలు కేంద్రంలో మూడు రోజుల క్రితమే 96 క్వింటాళ్ల వడ్లు అమ్మిన. వాల్లే గన్ని బ్యాగ్లు ఇచ్చిన్రు. మన ప్రభుత్వం రైతుల కోసం ఎంతో చేస్తుంది. ఇంతకు ముందు ఇటువంటి పరిస్థితి లేదు. వడ్లు పండించిన రైతులు అమ్ముకోవడానికి ఏలాంటి ఇబ్బుదులు లేకుండా సర్కారే కొనడం చాల మంచిగా ఉంది.
-వెన్నపల్లి పెంటయ్య, దహెగాం
కొనుగోలు కేంద్రాలతోనే గిట్టుబాటు ధర
సోన్, డిసెంబర్ 15 : నాకున్న నాలుగున్నర ఎకరాల్లో వరి వేసిన. 75 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. ఇది వరకు కొనుగోలు కేంద్రాలు లేకపోవడంతో దళారులు చెప్పిన ధరకే అమ్ముకునేటోళ్లం. ఇట్లా చాలా నష్టపోయేటోళ్లం. తెలంగాణ సర్కారోళ్లు మా ఊరిలోనే కొనుగోలు కేంద్రం పెట్టించిన్రు. అక్కడే అమ్ముకున్న. క్వింటాలుకు రూ. 2,060 మద్దతు ధర కలిసివచ్చింది.
– రఘుపతిరెడ్డి, బొప్పారం, సోన్ మండలం
అమ్మిన వారంలోపే..
మంచిర్యాల అర్బన్, డిసెంబర్ 15 : ఏడు ఎకరాల్లో వరి వేసిన. ఇందులో నా సొంత భూమి రెండు ఎకరాలు పోను మరో ఐదు ఎకరాలు కౌలుకు పట్టిన. మొత్తం 426 (40 కిలోల) బస్తాల దిగుబడి వచ్చింది. రెండు సార్లు వీటిని కాంటా వేసి పంపిన. మొదటి సారి 190 బస్తాలు (76 క్వింటాళ్లు) 1010 వరి ధాన్యం అమ్మితే వారంలోపే రూ.1,56,560 అకౌంట్ల జమైనయ్. 236 బస్తాలు మిల్లుకు పోయినయ్. ఇంకా వాటి డబ్బులు పడాల్సి ఉంది. ఈ ఏడాది దిగుబడి తగ్గినా ఎలాంటి కష్టం లేకుండా వడ్లు అమ్ముడుపోయినయ్. యాసంగికి నారు మడి సిద్ధం చేసిన.
– చౌతకారి రమేశ్, గుడిపేట, హాజీపూర్
కొనుగోళ్లు సాఫీగా సాగుతున్నయ్
మంచిర్యాల అర్బన్, డిసెంబర్ 15 : ధాన్యం కొనుగోళ్లు సాఫీగా సాగుతు న్నయ్. గతంలో లారీలు, మిల్లుల్లో అన్లోడింగ్ సమస్య ఉండేది. ఈ ఏడాది అలాంటివేవీ లేకుండా జాగ్రత్తలు తీసుకున్నాం. రైతులకు పేమెంట్లు కూడా యథావిధిగా అవుతున్నాయి. జిల్లాలో ధాన్యం ఎక్కువగా వస్తుందనే నివేదిక ఆధా రంగా ముందస్తుగానే మన జిల్లా ధాన్యాన్ని ఆదిలాబాద్, నిర్మల్ మిల్లులకు తరలిస్తు న్నాం. త్వరలో పెద్దపల్లి, కరీంనగర్ జిల్లా ల్లోని మిల్లులకు తరలించేందుకు అనుమతి తీసుకుంటాం. ఏ మిల్లు వద్ద లారీలు నిలబ డ్డాయనే రిమార్కు లేకుండా చూస్తున్నాం.
– ఏ ప్రేమ్కుమార్, పౌరసరఫరాల అధికారి, మంచిర్యాల