భైంసాటౌన్, ఫిబ్రవరి 25 : ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే మన నీళ్లు, నిధులు, నియామకాలు మనకే దక్కుతాయని ఆనాడు కన్న కలలు.. స్వరాష్ట్రంలో నేడు సాకారం అవుతున్నాయని ముథోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి అన్నారు. భైంసా పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయంలో శనివారం 167 మంది లబ్ధిదారులకు రూ.1.67 కోట్ల విలువైన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2001లో ఉద్యమ రథసారథిగా కేసీఆర్ చెప్పిన ప్రతి అక్షరం నేడు ఆయన నాయకత్వంలో నిజమవుతున్నదన్నారు. కోట్లాది రూపాయలతో అన్ని ప్రాంతాల రూపురేఖలు మార్చడంతో పాటు వినూత్న రీతిలో అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా చూస్తున్నారని తెలిపారు. దేశంలో మరెక్కడా లేని విధంగా తెలంగాణలో అన్ని రకాల అభివృద్ధితో పాటు పథకాలతో ఆడబిడ్డల ఆత్మగౌరవం మరింత పెంచామని చెప్పారు.
ఉమ్మడి రాష్ట్రంలో ఆకలి చావులు, ఆత్మహత్యలు ఎన్నో చూశామని, పోరాడి సాధించిన తెలంగాణలో వాటిని పూర్తిగా రూపుమాపామన్నారు. ప్రజలు అడగకుండానే సీఎం కేసీఆర్ అనేక పథకాలు అందిస్తున్నారని, రాష్ట్ర ప్రజలంతా ఏదో ఒక రూపంలో లబ్ధిపొందుతున్నారని తెలిపారు. మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్కు చెందిన పలు గ్రామాలు ఇప్పటికే తెలంగాణలో విలీనం కావాలని కోరుకుంటున్నాయన్నారు. తెలంగాణ మాదిరి సంక్షేమ పథకాలను యావత్ దేశానికి అందించాలనే లక్ష్యంతోనే టీఆర్ఎస్.. బీఆర్ఎస్ పార్టీగా అవతరించిందని తెలిపారు. ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీని అన్ని రాష్ర్టాలు స్వాగతిస్తున్నాయని, రాబోయే రోజుల్లో సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణతో పాటు యావత్ దేశాభివృద్ధిలో పెనుమార్పులు తీసుకరావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కల్పన జాదవ్, ఏఎంసీ మాజీ చైర్మన్ పిప్పెర కృష్ణ, వైస్ ఎంపీపీ గంగాధర్, సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.
రైతు శ్రేయస్సే ప్రభుత్వ ధ్యేయం
తానూర్, ఫిబ్రవరి 25 : ఆరుగాలం శ్రమించి పంటలు పండించే రైతన్నల శ్రేయస్సే బీఆర్ఎస్ ప్రభుత్వ ధ్యేయమని ముథోల్ ఎమ్మెల్యే విఠల్రెడ్డి అన్నారు. మండలంలోని హంగిర్గా సొసైటీ ఆధ్వర్యంలో డాంగ్పెల్లి గోదాంలో శనగ కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. సొసైటీ చైర్మన్ నారాయణ్రావు పటేల్ ఎమ్మెల్యే విఠల్రెడ్డిని శాలువా, పూలమాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ రైతులకు ఇబ్బందులు కలుగకుండా కృషి చేస్తున్నారన్నారు. శనగలను క్వింటాల్కు రూ.5,335 ధరతోప్రభుత్వం కొనుగోలు చేస్తున్నదని చెప్పారు.
ఈ కార్యక్రమంలో ఆత్మ చైర్మన్, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కానుగంటి పోతారెడ్డి, వైస్ ఎంపీపీ జెల్లావార్ చంద్రకాంత్, మాజీ ఎంపీపీలు బాశెట్టి రాజన్న, గంగాధర్పటేల్, తానూర్ మండల సర్పంచుల సంఘం అధ్యక్షుడు తాడేవార్ విఠల్, సొసైటీ వైస్ చైర్మన్ పసుల నాగ్నాథ్, భైంసా మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పిప్పెర కృష్ణ, బీఆర్ఎస్ పార్టీ మండల ఉపాధ్యక్షుడు చంద్రకాంత్యాదవ్, కోఆప్షన్ సభ్యుడు గోవింద్రావుపటేల్, సర్పంచులు సాయినాథ్, బాలాజీ, శీల బాలాజీ, సంతోష్పటేల్, తాన్సింగ్, సొసైటీ డైరెక్టర్లు హున్గుందే పుండ్లిక్, సంతోష్, అమోల్, గజానంద్, గంగాధర్, అక్బర్, మాజీ సర్పంచులు జాదవ్ మాధవ్రావు పటేల్, ధార్మోడ్ రాములు, సీఈవో భూమయ్య, వ్యవసాయ విస్తరణ అధికారులు సంఘవి, నరేశ్, విష్ణు, బీఆర్ఎస్ నాయకులు రాజారెడ్డి, సుదర్శన్రెడ్డి, లస్మన్న, పిప్పెర గోపాల్, సాయినాథ్, దత్తురాం పటేల్, మండలంలోని రైతులు, బీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు.
రజక సంఘానికి ప్రొసీడింగ్ అందజేత
భైంసా, ఫిబ్రవరి 25 : కుంటాల మండలం కల్లూర్ రజక సంఘానికి రూ.2.50 లక్షల ప్రొసీడింగ్ కాపీని ఎమ్మెల్యే విఠల్ రెడ్డి నాయకులకు అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విఠల్ రెడ్డిని పలువురు రజక సంఘం నాయకులు సన్మానించారు. ఈయన వెంట బీఆర్ఎస్ నాయకులు బుచ్చన్న, సోషల్ మీడియా జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ పెంటవార్ దశరథ్, రమణాగౌడ్, సుధాకర్, లక్ష్మి, పురుషోత్తం, ముత్యం, కిరణ్, రాజు, రాజేశ్ తదితరులు ఉన్నారు.