కుభీర్, ఫిబ్రవరి 17 : రైతులు పండించిన పంటలకు మద్దతు ధర కల్పించడంతో పాటు దళారీ వ్యవస్థను రూపుమాపేందుకే ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నదని ముథోల్ ఎమ్మెల్యే గడ్డిగారి విఠల్రెడ్డి అన్నారు. రాష్ట్రంలోనే మొట్ట మొదటిసారిగా కుభీర్ మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన శనగ కొనుగోలు కేంద్రాన్ని మార్క్ఫెఢ్ రాష్ట్ర డైరెక్టర్ రేకుల గంగాచరణ్తో కలిసి శుక్రవారం ప్రారంభించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం సహకారం లేక పోయినా రాష్ట్ర ప్రభు త్వం, సీఎం కేసీఆర్ సర్కార్ రైతుల శ్రేయస్సే లక్ష్యంగా ముందుకు సాగుతున్నదని చెప్పారు. రాష్ట్రం ఏర్పాటు కాక ముందు ఇక్కడి పంటలు, ఉత్పత్తులను భైంసా, నిజామాబాద్, భోకర్ తదితర మార్కెట్లకు తీసుకెళ్లి అమ్ముకునే వాళ్లమని గుర్తు చేశారు.
రైతుల సౌకర్యార్థం సుమారు రూ.3కోట్లతో మార్కెట్ను అభివృద్ధి చేసినట్లు తెలిపారు. రైతులు ఈ కేంద్రాన్ని వినియోగించుకోవాలని కోరారు. ఉమ్మడి ఆదిలాబాద్ మార్క్ఫెడ్ డీఎం గౌరీ నాగేశ్వర్రావు, పీఏసీఎస్ సీఈవో ఎగ్గం క్రాంతి కుమార్, వైస్ ఎంపీపీ మొహియొద్దీన్, ఉప సర్పంచ్ ఇక్రమొద్దీన్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సంతోష్, వైస్ చైర్మన్ దిగంబర్ పటేల్, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు ఎన్నీల అనిల్, జిల్లా ప్రధాన కార్యదర్శి తూము రాజేశ్వర్, మాజీ జడ్పీటీసీ శంకర్ చౌహాన్, సంజయ్, పీఏసీఎస్ మాజీ చైర్మన్ రాములు, కోఆప్షన్ సభ్యుడు దత్తహరి పటేల్, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు ఎన్ దత్తూగౌడ్, నాయకులు దొంతుల సాయన్న, రాజేశ్, సాహెబ్రావు, రఫీక్, రవూఫ్, పీఏసీఎస్, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, ఆయా గ్రామాల సర్పంచ్లు పాల్గొన్నారు.
ముథోల్లో కొనుగోలు కేంద్రం ప్రారంభం
ముథోల్, ఫిబ్రవరి 17 : కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే విఠల్ రెడ్డి అన్నారు. ముథోల్ పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శనగల కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. క్వింటాలుకు రూ. 5,335 ప్రభుత్వం చెల్లిస్తున్నదని తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ రాజేందర్, డైరెక్టర్లు సుదర్శన్, మున్నూరుకాపు సంఘం అధ్యక్షుడు రమేశ్, మాజీ ఎంపీటీసీ పోతన్న యాదవ్, సర్పంచ్లు రాంరెడ్డి, విజేశ్, నాయకులు నరేందర్ రెడ్డి, మైసాజీ, రవికిరణ్ గౌడ్ ఉన్నారు.
లోకేశ్వరం, ఫిబ్రవరి 17 : మండలంలోని అబ్దుల్లాపూర్లో శుక్రవారం ముథోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డిని ఆయన నివాసంలో కలిసి సన్మానించారు. తమ గ్రామంలో వీర బ్రహ్మేంద్రసామి ఆలయ నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని ఎమ్మెల్యేను కోరగా ఆయన ఇచ్చినట్లు తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ రమణా రెడ్డి, ఎంపీటీసీ గంగాధర్, గ్రామస్తులు డాక్టర్ సాగర్, డాక్టర్ రమేశ్, సదానందం, లింబాద్రి, మహేశ్, పదాల మహి ఉన్నారు.